ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు.. ఎవ‌రీ అవధేష్ రాయ్? హత్య కేసు వివ‌రాలు ఇవే..

Published : Jun 05, 2023, 05:17 PM IST
ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు.. ఎవ‌రీ అవధేష్ రాయ్? హత్య కేసు వివ‌రాలు ఇవే..

సారాంశం

Varanasi: అవధేశ్ రాయ్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీని దోషిగా తేల్చిన వారణాసి కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1991 ఆగస్టు 3న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవదేశ్ రాయ్ ను వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి ముందు కాల్చి చంపారు.  

gangster-politician Mukhtar Ansari: 1991లో జరిగిన అవదేశ్ రాయ్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్టు 3వ తేదీన అవదేశ్ రాయ్ ను హతమార్చాడు. అవదేశ్ రాయ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు. ప్రస్తుతం ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ యూనిట్ ప్రాంతీయ చీఫ్ గా ఉన్నారు. కోర్టు తీర్పును స్వాగతించిన రాయ్.. "ఒక పేరుమోసిన నేరస్తుడిపై మా 32 సంవత్సరాల పోరాటానికి ఇది ముగింపు" అని అన్నారు. అలాగే,  'నేను, నా తల్లిదండ్రులు, అవదేశ్ కుమార్తె, కుటుంబం మొత్తం సహనంతో ఉన్నాం. ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. ముక్తార్ తనను తాను బలోపేతం చేసుకున్నాడు. అయినా మేం వదల్లేదు. మా లాయర్ల కృషి వల్లే ఈ రోజు నా సోదరుడి హత్య కేసులో ముక్తార్ ను కోర్టు దోషిగా తేల్చింది" అని అన్నారు. 

గ్యాంగ్ స్టర్లకు ఎదురుగా నిలిచి పోరాడే వారికి ఎప్ప‌టికైనా న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 'మాకు బెదిరింపులు వచ్చాయి. భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నాను. నాకు ఏదైనా జరిగితే బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది' అని రాయ్ అన్నారు. 

హత్య కేసు గురించి..

1991 ఆగస్టు 3న వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి బయట అవదేశ్ రాయ్ ను కాల్చి చంపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు సోదరులు తమ ఇంటి గేటు వద్ద నిల్చొని ఉండగా ముక్తార్ అన్సారీతో సహా కొందరు దుండగులు కారులో వచ్చి అవధేష్ ను కాల్చి చంపారని న్యాయవాదులు తెలిపారు. దీనికి ప్రతీకారంగా అజయ్ తన లైసెన్స్ డ్ పిస్టల్ తో కాల్పులు జరపగా దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. అవదేశ్ ను వెంటనే కబీర్ చౌరాలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తన సోదరుడి హత్య జరిగిన వెంటనే, రాయ్ వారణాసిలోని చెట్గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. ఇందులో ముక్తార్ అన్సారీ, ఎమ్మెల్యేలు అబ్దుల్ కలాం, భీమ్ సింగ్, కమలేష్ సింగ్, రాకేష్ శ్రీవాస్తవ అలియాస్ రాకేష్ జస్టిస్ పేర్లను పేర్కొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు