సోమనాథుడిని సందర్శించుకున్న ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ.. ఆలయానికి భారీ విరాళం..

Published : Feb 19, 2023, 01:45 AM IST
సోమనాథుడిని సందర్శించుకున్న ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ.. ఆలయానికి భారీ విరాళం..

సారాంశం

మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ్ మహదేవ్‌ను దర్శించుకోవడంతో పాటు, సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ.1.51 కోట్ల విరాళాన్ని కూడా ముఖేష్ అంబానీ అందించారు. 

మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, తన కుమారుడు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు తరపున వారికి ట్రస్టు అధ్యక్షుడు పి.కె. లాహిరి, కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ ప్రత్యేక స్వాగతం పలికారు. తండ్రి కొడుకులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సమయంలో.. ఇద్దరూ శివునికి జలాభిషేకం చేసి ప్రార్థనలు కూడా చేశారు. సోమనాథ్ మహదేవ్‌ను దర్శించుకోవడంతో పాటు, సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు ముఖేష్ అంబానీ 1.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అంబానీ కుటుంబం సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది.వారు అన్ని హిందూ పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా అంబానీ పూజలు చేసి విరాళాలు కూడా అందించారు.

తిరుమల సందర్శన

గతంలో ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ కూడా రూ.1.5 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. ఈ సమయంలో కుమారుడు అనంత్ కాబోయే భర్త రాధికర్, మర్చంట్, రిలయన్స్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ మోడీ కూడా అతనితో ఉన్నారు.

సోమనాథ్ ఆలయం గురించి..

సోమనాథ్ ఆలయం గుజరాత్‌లో ఉంది. ఇది దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. చారిత్రక శివాలయం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని చంద్రదేవుడు నిర్మించాడని కూడా చెబుతారు. ఈ ఆలయాన్ని చాలాసార్లు కూల్చివేయడం, ఆ తర్వాత మళ్లీ నిర్మించడం చరిత్రలో కనిపించింది. 

PREV
click me!

Recommended Stories

Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?