వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత.. ఎంత మంది రక్షణగా ఉంటారో తెలుసా?

Published : Sep 30, 2022, 04:14 AM IST
వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత.. ఎంత మంది రక్షణగా ఉంటారో తెలుసా?

సారాంశం

ప్రపంచ కుభేరుల్లో ఒకైర‌న  ముఖేష్ అంబానికి భద్రతను పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయ‌న‌కు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుండగా.. తాజాగా ఆ భద్రతను జడ్ ప్లస్ కేటగిరికి పెంచినట్టు తెలుస్తోంది. 

వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముఖేష్ అంబానీ భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  ఆయ‌న‌కు భద్రతను పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖేష్ అంబానికి జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుండగా.. తాజాగా ఆ భద్రతను జడ్ ప్లస్ కేటగిరికి పెంచినట్టు తెలుస్తోంది. మూలాల ప్రకారం..  ముఖేష్ అంబానికి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్, భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదికలను స‌మీక్షించి..ఆయ‌న‌కు  'Z+ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని  కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం..  అంబానీ ప్రపంచంలోని 10వ అత్యంత సంపన్న వ్యక్తి. గత ఏడాది ప్రారంభంలో ముంబైలోని అతని ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన SUV కనిపించడంతో అంబానీ భద్రతను పెంచారు, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రేరేపించింది. అంతకుముందు, మరో పారిశ్రామికవేత్త మరియు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి గత నెలలో కేంద్ర ప్రభుత్వం CRPF కమాండోల 'Z' కేటగిరీ VIP భద్రతను ఇచ్చింది. చెల్లింపు ప్రాతిపదికన కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.

ముఖేష్ అంబాని భద్రత కోసం ఏర్పాటు చేసిన జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఏర్పాట్లకు అయ్యే సిబ్బంది ఖర్చులను ఆయనే భరిస్తారు. ఇటీవల ముంబైలోని ముఖేష్ స‌మీపంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఆయ‌న భద్రతకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

చెల్లింపు ప్రాతిపదికన మొదటిసారిగా 2013లో ఆయ‌న‌కు CRPF కమాండోల 'Z' కేటగిరీ కవర్‌ను అందించారు. అతని భార్య నీతా అంబానీకి కూడా ఇలాంటి సాయుధ కవర్ ఉంది. వారికి Y+ కేటగిరీ భద్రత ఉంది. ఇందులో కమాండోల సంఖ్య కూడా తక్కువ.
 
జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ కవర్ అంటే...

దేశంలో ప్రముఖ వ్యక్తుల‌కు అందించే రెండవ అత్యున్నత భద్రతా వలయమే జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి సెక్యూరిటీ. జడ్ ప్లస్ సెక్యురిటీ కవర్ ఉన్న వారి కుటుంబసభ్యులకు కూడా ఈ భ‌ద్ర‌త ఉంటుంది. ఇందులో మొత్తం 55 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వారిని నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉంటారు. ఈ 55 మంది సిబ్బందిలో 10 మందికిపైగా నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ కమాండోలు (ఎన్ఎస్‌జీ కమాండోలు), పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు. 
 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families