అమరవీరుల కుటుంబాన్ని ఆదుకున్న ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

Published : Nov 26, 2018, 01:01 PM IST
అమరవీరుల కుటుంబాన్ని ఆదుకున్న ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

సారాంశం

2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. 

26/11 ముంబయి దాడులు జరిగి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన భారత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబాన్ని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఆదుకున్నారు. ఈ ఘటనపై ముందుగా స్పందించి ఆయన తన ఉదారత చాటుకున్నారు. ‘ బ్రేవ్ హార్ట్’ అనే ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.25లక్షలు విరాళంగా ఇచ్చారు.

 

కాగా.. ఈ దాడులు జరిగి పదేళ్లు అయిన సందర్భంగా ఎంపీ చంద్రశేఖర్ చేసిన సహాయాన్ని ఓ మహిళ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !