26/11దాడులకు నేటితో.. పదేళ్లు

By ramya neerukondaFirst Published Nov 26, 2018, 11:31 AM IST
Highlights

26/11 ముంబయి దాడులు జరిగి.. నేటికి సరిగ్గా పదేళ్లు.  2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. 

26/11 ముంబయి దాడులు జరిగి.. నేటికి సరిగ్గా పదేళ్లు.  2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ రోజు నివాళులర్పించారు.

ముంబయిలోని పోలీసు జింకానాలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసులు అమరవీరులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. ఆయనతోపాటు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర పోలీస్ చీఫ్ దత్త పద్సాల్గికర్, ముంబయి కమిషనర్ ఆఫ్ పోలీసు సుబోద్ కుమార్ జైశ్వాల్ లు కూడా అమరవీరులకు నివాళులర్పించారు.

 

Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis, Governor C Vidyasagar Rao and other cabinet ministers pay tribute at Martyrs' Memorial, Police Gymkhana at Marine Lines on the 10th anniversary of . pic.twitter.com/KZt1ipRZOV

— ANI (@ANI)

అప్పటి దాడుల్లో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీసుల కుటుంబాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారంతా.. అమరవీరుల గొప్పతనాన్ని స్మృతించుకున్నారు. 

click me!