
న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారుల అంతర్యుద్ధంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించిందని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీబీఐ పరిణామాలపై తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు. ఈ వివాదంలో మోడీ ప్రభుత్వం నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారుపోలీసు శాఖలో అవినీతి ప్రబలిందనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య అంతర్యుద్ధం కారణంగా ఈ ఇద్దరు అధికారులను సెలవుపై వెళ్లాలని మోడీ ఆదేశించారు. అంతేకాదు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావును నియమించిన విషయం తెలిసిందే.