2022-23లో 125 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు.. 95,000 మోసం కేసులు: కేంద్రం

Published : Mar 23, 2023, 11:37 AM IST
2022-23లో 125 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు..  95,000 మోసం కేసులు:  కేంద్రం

సారాంశం

New Delhi: 2022-23లో 95,000 యూపీఐ మోసం కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం పార్లమెంట్ లో వెల్ల‌డించింది. గత ఏడాదిలోనే రూ.125 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు పూర్తయినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

Over 95,000 UPI fraud cases reported in 2022-23: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు సంబంధించి 2022-23 లో దేశంలో 95,000 కంటే ఎక్కువ మోసం కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో వెల్ల‌డించింది. ఇది 2020-21 లో 77,000 కేసుల నుండి పెరిగిందను న‌మోదుచేసింద‌ని పేర్కొంది. 2021-22 లో 84,000 కేసులు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది.

గత ఏడాదిలోనే రూ.125 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు పూర్తయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందనీ, సింగపూర్, యూఏఈ, మారిషస్, నేపాల్, భూటాన్లు యూపీఐని స్వీకరించిన దేశాల్లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ లో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ మోసాలపై రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

"యూపీఐ అనువర్తనాలు ఒక వినియోగదారుడు తెలియని లబ్ధిదారునికి చెల్లింపును ప్రారంభిస్తున్న ఇన్-యాప్ సమాచారాన్ని అందిస్తాయి. డివైజ్ బైండింగ్ కాన్సెప్ట్, దీనిలో వినియోగదారుడి మొబైల్ నంబర్ అతని మొబైల్ పరికరంతో బంధించబడి ఉంటుంది. ఇందులో ఇద‌రులు జోక్యం చేసుకోవడం దాదాపు అసాధ్యం చేస్తుంది" అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ పార్లమెంటుకు తెలిపారు. కాగా, యూపీఐ మోసాల గురించి ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ను కూడా తీసుకువచ్చిందని కరాడ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu