యూపీ బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం: మోడీ అభినందన

Published : Jul 10, 2021, 09:08 PM IST
యూపీ బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం: మోడీ అభినందన

సారాంశం

త్వరలో యూపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బ్లాక్ పంచాయితీ చీఫ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై మోడీ పార్టీ కార్యకర్తలను అభినందించారు. యూపీ సీఎం అమలు చేసిన పథకాలతో ప్రజలు పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ:  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  జరిగిన బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో  బీజేపీ భారీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ  హర్షం వ్యక్తం చేశారు. యూపీ రాష్ట్రంలో బ్లాక్ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

యోగి ఆదిత్యనాథ్ సర్కార్  ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజన పథకాల ద్వారా ప్రజాలకు లభించిన ప్రయోజనాలతో రాష్ట్రంలో పార్టీకి భారీ విజయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.  పార్టీ కార్యకర్తలంతా ఈ విజయానికి అభినందనలకు అర్హులేనని ఆయన చెప్పారు.

ఇవాళ  బ్లాక్ పంచాయితీ చీఫ్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందే సమయానికి  కనౌజ్, లక్నో ల్లో 8 బ్లాకుల్లో 6 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది.  సీతాపూర్ లో 19 స్థానాల్లో 15 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ముజఫర్ నగర్ లో  9 స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది.  మరో స్థానంలో ఆర్‌ఎల్డీ విజయం సాధించింది.అజంఘర్ లో 12 స్థానాలను బీజేపీ గెలుచుకొంది.

 

 


 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?