రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-27 యుద్ద విమానం

Published : Feb 12, 2019, 09:03 PM IST
రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-27 యుద్ద విమానం

సారాంశం

భారత వైమానిక దళానికి చెందిన మిగ్-27 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. జైసల్మేర్ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడని తెలిపారు. ఈ విమాన ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.  

భారత వైమానిక దళానికి చెందిన మిగ్-27 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. జైసల్మేర్ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడని తెలిపారు. ఈ విమాన ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.  

ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నట్లు రక్షణ శాఖ అధికారి సోంబిత్ ఘోష్ వెల్లడించారు. ఇటీవల ఈ తరహా యుద్ద విమానాలు ఎక్కువగా ప్రమాదానికి గురవుతుండటం రక్షణ శాఖలో ఆందోళనను సృష్టిస్తోంది. 

ర‌ష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ మిగ్‌ యుద్ద విమానాల పనితీరుపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. ఈ యుద్దవిమానాలు సాధారణ పరిస్థితుల్లోనే ఇలా వుంటే యుద్దాల సమయంలో ఇంకేం పనిచేస్తాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. అందువల్ల రక్షణ రంగానికి చెందిన విమానాల విషయంతోబ మరింత నాణ్యత పాటించాలని వారు సూచిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu