ముంబైలోని ముంబ్రా గోదాములో భారీ అగ్నిప్రమాదం

By Rajesh KarampooriFirst Published Oct 17, 2022, 5:21 AM IST
Highlights

ముంబైలోని ముంబ్రా కాల్వా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు నాలుగు అగ్నిమాపక యంత్రాలు, ముంబై పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

దేశ ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం  ముంబ్రా కాల్వా ప్రాంతంలోని షీల్ ఫాటా సమీపంలో ఉన్న ఖాన్ కాంపౌండ్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళం మరియు ముంబై పోలీసు వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సింది.  
 
 

| Maharashtra: A massive fire broke out at a godown in the Mumbra area of ​​Thane city. 4 fire tenders & Mumbra police team on the spot. pic.twitter.com/njHhV1OEbh

— ANI (@ANI)

ఇదిలా ఉంటే.. ముంబై లో ఆదివారం 167 COVID-19 కేసులను నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 11,52,480 కు చేరుకుంది, అలాగే.. గత 24 గంటల్లో ఎవరూ చనిపోలేదని  పౌర అధికారి తెలిపారు.బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ అధికారి ప్రకారం.. కొత్త కేసులలో 14 మాత్రమే రోగలక్షణాలు, రికవరీ సంఖ్య 172 పెరిగి 11,31,604కి చేరుకుంది, దీనితో నగరంలో 1,138 క్రియాశీల కాసేలోడ్‌తో ఉంది. గణాంకాల ప్రకారం.. రికవరీ రేటు 98.2% గా ఉందని తెలిపారు.


ఆదివారం నాడు మహారాష్ట్ర మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 440గా నమోదుగా.. ఒక మరణం సంభవించింది. దీంతో కేసుల సంఖ్య 81,27,699 కు చేరుకోగా.. మరణాల సంఖ్య 1,48,372 కు చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. పండుగల సీజన్‌లో చాలా మంది ప్రజలు గుమిగూడి పండుగలను బహిరంగంగా జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ ముగుస్తున్నందున, అధికారులు మరియు ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ -19 నిఘా ఉంచాలి. వ్యాధిని మళ్లీ మన జీవితాలకు అంతరాయం కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

click me!