కొద్దిసేపట్లో అమిత్ షా ర్యాలీ: బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన మావోలు

By Siva KodatiFirst Published May 3, 2019, 10:35 AM IST
Highlights

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సరైకెలా జిల్లా ఖర్సవన్‌లో బీజేపీ కార్యాలయాన్ని పేల్చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఇవాళ ఖుంటీ నియోజకవర్గంలో ర్యాలీక చేయడానికి ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది.

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సరైకెలా జిల్లా ఖర్సవన్‌లో బీజేపీ కార్యాలయాన్ని పేల్చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఇవాళ ఖుంటీ నియోజకవర్గంలో ర్యాలీక చేయడానికి ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది.

ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ అభ్యర్ధి అర్జున్ ముండా ఇదే కార్యాలయం నుంచి పనిచేస్తుండటం గమనార్హం.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా శుక్రవారం ఖుంటి, కొడెర్మా, రాంచీలలో ర్యాలీలు నిర్వహించనున్నారు. మావోయిస్టులు దాడికి పాల్పడిన ఖర్సవన్ బీజేపీ కార్యాలయం ఖుంటి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 

click me!