తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

Published : May 07, 2023, 09:50 AM ISTUpdated : May 07, 2023, 10:02 AM IST
తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్  సరిహద్దులో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

సారాంశం

తెలంగాణ-ఛత్తీ‌స్ ఘడ్  రాష్ట్రాల సరిహద్దులో  ఇవాళ  జరిగిన  ఎన్ కౌంటర్ లో  ఒక మావోయిస్టు మృతి చెందాడు.  ఇరువర్గాల మధ్య  కాల్పులు చోటు  చేసుకున్నాయి. 

ఖమ్మం: తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్  సరిహద్దులో ఆదివారంనాడు  ఎన్ కౌంటర్ జరిగింది . ఈ ఎేన్ కౌంటర్ లో  ఓ మావోయిస్టు మృతీ చెందాడు.  మరో వైపు  మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య  కాల్పులు  కొనసాగుతున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్  సరిహద్దులో గల  చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో   ఇవాళ  ఎన్ కౌంటర్ జరిగింది.  

భద్రతా బలగాలు  కూంబింగ్  నిర్వహిస్తున్న  సమయంలో  మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య  కాల్పులు చోటు  చేసుకున్నాయి.   ఈ ఘటనలో  మావోయిస్టు  మృతి చెందాడు. ఇరు వర్గాల మధ్య  కాల్పులు  జరుగుతున్నాయి.  ఛత్తీస్‌ఘడ్  రాష్ట్రంలో  మావోయిస్టు కార్యకలాపాలను  అరికట్టేందుకు  భద్రతా బలగాలు  ప్రయత్నిస్తున్నాయి. దీంతో  మావోయిస్టులకు  పట్టున్న ప్రాంతాల్లో కూంబింగ్  ను  పెంచారు.

ఈ ఏడాది  ఏప్రిల్  26న  ఛత్తీస్ ఘడ్  రాష్ట్రంలోని దంతెవాడలో  మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో  11 మంది  పోలీసులు మృతి చెందారు. భద్రతా బలగాలకు  మావోయిస్టులు  వల వేసి  ఈ మందుపాతరను పేల్చారు. తమ ఉనికిని తెలిసేలా  మావోయిస్టులు  ప్రయత్నించారు.  ఈ విషయం తెలిసిన తర్వాత భద్రతా బలగాలు  కూంబింగ్ కు వచ్చాయి.  దీంతో  మావోయిస్టుల వాహనం లక్ష్యంగా  చేసుకొని మావోయిస్టులు  మందుపాతర పేల్చారు.

2018 మే మాసంలో  దంతెవాడ జిల్లా చోల్నోర్ గ్రామంలో  పోలీసుల వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడడారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్