ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి..

Published : Apr 18, 2023, 01:25 PM ISTUpdated : Apr 18, 2023, 01:44 PM IST
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి..

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని.. అందులో ఒకరు గాయపడ్డారని చెప్పారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్లవారి గ్రామ సమీపంలో ఉదయం 8 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం సెర్చింగ్ ఆపరేషన్‌లో ఉన్నప్పుడు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆంజనేయ వర్ష్నే తెలిపారు. 

మావోయిస్టు భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సీనియర్ నాయకులు ఆ ప్రాంతలో ఉన్నారనే ఇన్‌పుట్స్‌తో భద్రతా సిబ్బంది రెడ్డి క్యాంపు నుంచి పెట్రోలింగ్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఎదురుకాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి ఒక మావోయిస్టు మృతదేహాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒకరు గాయపడిన స్థితిలో ఉన్నారని పోలీసులు చెప్పారు. గాయపడిన మావోయిస్టును ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?