గుజరాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కు మ‌నీష్ సిసోడియాను జైల్లోనే ఉంచుతారు - కేజ్రీవాల్

Published : Oct 17, 2022, 02:34 PM IST
గుజరాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కు మ‌నీష్ సిసోడియాను జైల్లోనే ఉంచుతారు - కేజ్రీవాల్

సారాంశం

గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యే వరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను జైలులోనే ఉంచవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 

గుజ‌రాత్ ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్ 8వ తేదీ వ‌ర‌కు మనీష్ సిసోడియాను జైల్లోనే ఉంచుతార‌ని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తును రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో ఆయ‌న పోల్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘ గుజరాత్ ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. ఈ వ్యక్తులు (బీజేపీ) అప్పటి వరకు సిసోడియాను జైలులోనే ఉంచుతారు. దీని వల్ల ఆయన గుజరాత్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లలేరు ’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరిని కాల్చిచంపిన మావోయిస్టులు

కాగా.. అంతకు ముందు రోజు సిసోడియాను అరవింద్ కేజ్రీవాల్ భగత్ సింగ్ తో పోల్చారు. ఇది స్వతంత్రం కోసం రెండో పోరాటంగా ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు గుజరాత్ లోని మెహ్సానా జిల్లా ఉంఝా పట్టణం, బనస్కాంత జిల్లాలోని దీసా పట్టణంలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

వైఫ్ స్వాప్.. భార్యను మరొకరితో సెక్స్ చేయాలని ఒత్తిడి.. తిరస్కరించడంతో దాడి.. ‘నీకు కల్చర్ తెలీదు’

అరవింద్ కేజ్రీవాల్ చేసినట్టుగానే మనీష్ సిసోడియా కూడా ట్విట్టర్ లో ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇది తనను ప్రచార మార్గం నుండి తొలగించే ప్రయత్నం అని వాదించాడు. ‘‘ నేను జైలుకు వెళ్లడం గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ఆపదు. ఈ రోజు ప్రతి గుజరాతీ లేచి నిలబడ్డాడు. గుజరాత్ కు చెందిన చిన్నారి ఇప్పుడు మంచి పాఠశాలలు, ఆసుపత్రులు, ఉద్యోగాలు, విద్యుత్ కోసం ప్రచారం చేస్తోంది. గుజరాత్ లో రాబోయే ఎన్నికలు ఒక ఉద్యమంగా నిలుస్తాయి ’’ అని ఆయన పేర్కొన్నారు. 

‘‘ నాపై పూర్తిగా తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్టు చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం కోసం నేను గుజరాత్ వెళ్లాల్సి ఉంది. ఈ ప్రజలు గుజరాత్ ను ఘోరంగా కోల్పోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం నేను గుజరాత్ కు వెళ్లకుండా ఆపడమే వారి ఉద్దేశ్యం. నాపై నకిలీ కేసు పెట్టారు. నా ఇంట్లో నిర్వహించిన రైడ్ లో ఏమీ దొరకలేదు. నా బ్యాంక్ లాకర్లన్నిటినీ చూశారు. అందులో ఏమీ దొరకలేదు. మా ఊరికి వెళ్లి, ప్రతిదీ చెక్ చేశారు అయినా ఏమీ దొరకలేదు ’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu
Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu