Manipur violence: ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై ఎఫ్ఐఆర్ న‌మోదు

Published : Sep 04, 2023, 04:33 PM IST
Manipur violence: ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై ఎఫ్ఐఆర్ న‌మోదు

సారాంశం

Manipur violence: మణిపూర్‌లో మరిన్ని ఘర్షణలు సృష్టించే విధంగా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై కేసు న‌మోదైంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ముగ్గురు సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆరోపించాయి.   

FIR against Editors Guild members: మణిపూర్‌లో మరిన్ని ఘర్షణలు సృష్టించే విధంగా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై కేసు న‌మోదైంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ముగ్గురు సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆరోపించాయి.

మణిపూర్ రాష్ట్రంలో జరిగిన జాతి హింసను మీడియా కవరేజ్ చేసే అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు చెందిన ముగ్గురు సభ్యులపై కేసు నమోదైంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం తన నివేదికను విడుదల చేసింది. ఏదేమైనా, నివేదికలోని ఒక చిత్రం తప్పుడు శీర్షికను కలిగి ఉంది. దీనిని ఎడిటర్స్ గిల్డ్ కూడా అంగీకరించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే కమిటీలోని ముగ్గురు సభ్యులపై కేసు నమోదు కావడంతో ఆలస్యంగా విచారణ జరిగింది.

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందనీ, దాదాపు నాలుగు నెల‌లుగా జాతి కలహాలతో అల్లాడుతున్న రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్‌లో జాతి హింసపై మీడియా కథనాలు ఏకపక్షంగా ఉన్నాయనీ, రాష్ట్ర నాయకత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఇటీవల పేర్కొంది. మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని బిరెన్ సింగ్ తెలిపారు.

కేసు న‌మోదైన వారిలో ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సీమా ముస్తఫా, దాని ముగ్గురు సభ్యులు - సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్ లు ఉన్నారు. జాతి హింసకు సంబంధించిన మీడియా నివేదికలను అధ్యయనం చేసేందుకు గుహ, భూషణ్, కపూర్ గత నెలలో రాష్ట్రాన్ని సందర్శించారు. ఒక నిర్ధారణకు వచ్చే ముందు వారు అన్ని వర్గాల ప్రతినిధులను కలుసుకుని ఉండవలసిందనీ, కొన్ని వర్గాలను మాత్రమే క‌లిశార‌ని ముఖ్యమంత్రి బిరెస్ సింగ్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations