manipur election 2022 : మ‌ణిపూర్ లోని చురచంద్‌పూర్ లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి.. 5 గురికి గాయాలు

Published : Feb 27, 2022, 01:47 AM IST
manipur election 2022 : మ‌ణిపూర్ లోని చురచంద్‌పూర్ లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి.. 5 గురికి గాయాలు

సారాంశం

మణిపూర్ లోని చురచంద్ పూర్ జిల్లాలో శనివారం బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు మరో వ్యక్తి చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. మణిపూర్ అసెంబ్లీకి  ఈ నెల 28వ తేదీన మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. 

మణిపూర్ (manipur) అసెంబ్లీ (assembly) ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు కొన్ని గంటలకు ముందు శనివారం రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లాలో బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చురచంద్ పూర్ (Churachandpur) జిల్లాలోని గ్యాంగ్పిమువల్ (Gangpimual) గ్రామంలో ఓ ఇంట్లో బాంబు ఉంచారు. అయితే అదేంటో తెలియ‌క‌ ఆ ఇంట్లోని పిల్ల‌లు బాంబుతో ఆడుకోవడం ప్రారంభించారు, ఈ క్ర‌మంలో అది పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఏడుగురికి గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వారంద‌రినీ చురచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో చిన్నారితో పాటు ఓ వ్య‌క్తి మృతి చెందారు. మ‌రో ఐదుగురు ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. 

సీనియర్ పోలీసు అధికారులు, బలగాలు ఆ ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. బాధ్యులు ఎవ‌ర‌నేది గుర్తించి, వారిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8న ప్రకటించిన తర్వాత శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ప్ర‌మాదం మొదటి  హింసాత్మక ఘటన. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 28, మార్చి 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

PREV
click me!

Recommended Stories

Gold : ఇండియాలో అత్యధిక బంగారం కొనేది ఎక్కడో తెలుసా..? 20% ఇక్కడేనా..!
ఏడాది బంగారం కొనకండి మోదీ చెప్పింది ఇందుకే | Indian economy analysis | Asianet News Telugu