మర్డర్ మిస్గరీ : ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు.. కానీ కట్ చేస్తే శవమై తేలిన భర్త..

Published : Feb 20, 2023, 01:30 PM IST
మర్డర్ మిస్గరీ : ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు.. కానీ కట్ చేస్తే శవమై తేలిన భర్త..

సారాంశం

మృతుడు మున్నా అనే వ్యక్తిగా గుర్తించారు. అతనికి ఇద్దరు మహిళలతో వివాహమైంది. కాగా అతని మృతదేహం మెడపై లిగేచర్ గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ హత్య కలకలం రేపింది. ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఆదివారం శవమై కనిపించాడు. ఈ ఘటనపై కరావాల్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్ లో సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనికి హత్య కేసుగా నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుపుతూ.. 

ఫిబ్రవరి 19న హత్యకు సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చింది, ఆ ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. “నా భర్త ఎంత లేపినా నిద్ర లేవడం లేదు. బహుశా అతను చనిపోయాడేమో అని అనుమానంగా ఉంది” అని తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కరవాల్ నగర్‌లోని వెస్ట్ కమల్ విహార్‌లోని గాలి నంబర్ 3/2లోని  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు మున్నా అనే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు వెళ్లేసరికి అతను రక్తపు మడుగులో మంచంపై పడి ఉన్నాడు.

షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం.. బెదిరించి 30 మంది మహిళల నుంచి బంగారం చోరీ

నిశితంగా పరిశీలించిన తర్వాత, పోలీసు బృందం మెడపై గొంతుకు ఏదో బిగించి చంపడానికి ప్రయత్నించిన గుర్తుతో పాటు, తలపై గాయం గుర్తును కనుగొన్నారు. వెంటనే,  ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ విభాగం (ఎఫ్‌ఎస్‌ఎల్), క్రైమ్ టీమ్‌లను ఘటనా స్థలానికి పిలిపించి తనిఖీలు చేయించారు. రక్తపుమడుగులో ఉన్న మున్నాను జీటీబీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతడిని పరీక్షించిన డాక్టర్లు అతను చనిపోయినట్లు ప్రకటించాడు. మృతదేహాన్ని జీటీబీ మార్చురీలో భద్రపరిచారు. కరావల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడికి ఇద్దరు మహిళలతో వివాహమైందని, అతనితో పాటు ప్రస్తుతం ఉంటున్న భార్యకు.. అతనికి మధ్య వయసు తేడా చాలా ఎక్కువ ఉందని పోలీసులు విచారణలో తేలింది. మున్నా ఆమెతో తరచూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తర ఢిల్లీలోని గులాబీ బాగ్ ప్రాంతంలో గోవధకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 7న గులాబీ బాగ్‌లోని రోష్నారా అండర్‌పాస్ వద్ద ఖాళీ స్థలం దగ్గర గోహత్య ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనాస్థలం నుంచి పశువుల అవశేషాలను సేకరించి ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు.

ప్రాథమిక దర్యాప్తు తరువాత, నిందితుడిని శనివారం ఢిల్లీ వ్యవసాయ పశువుల సంరక్షణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు. నిందితుడిని బాబర్‌పూర్‌లోని జనతా మజ్దూర్ కాలనీకి చెందిన అఫ్తాబ్ అహ్మద్ అలియాస్ లుక్మాన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు తన సహచరులు అర్కామ్, సలీమ్, మారుఫ్,అల్తామాస్‌తో కలిసి పలు సందర్భాల్లో ఆవు మాంసాన్ని విక్రయించేందుకు వాటిని వధించినట్లు వెల్లడించినట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 6, 7 మధ్య రాత్రి, తన సహ నిందితులతో కలిసి హోండా సిటీ కారులో గులాబీ బాగ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనే స్వయంగా వాహనం నడుపుతున్నాడు.

సహ నిందితులు దారిలో ఓ ఆవును పట్టుకుని గులాబీ బాగ్‌లోని ఖాళీ స్థలంలో వధ కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన స్థలం ఆలయానికి ఆనుకొని ఉన్నాయని వారు తెలిపారు. ఢిల్లీ పోలీసులలోని రోహిణి, ఔటర్ నార్త్ జిల్లాల్లో గోహత్య కేసుల్లో కూడా వారు ప్రమేయం ఉన్నారు. అహ్మద్‌పై 2022లో వెల్‌కమ్, శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లలో దోపిడీ, స్నాచింగ్, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi Speech: బెంగాల్ లో బీజేపీ గెలుపుపై మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
CM Convoy Reaches Vijay’s House: విజయ్ కోసం సీఎం క్యాన్వాయ్ సిద్ధం | Asianet News Telugu