ప్రేయసిని చంపి శవాన్ని గోడలో దాచిపెట్టాడు

Published : Jan 16, 2021, 07:27 AM ISTUpdated : Jan 16, 2021, 07:28 AM IST
ప్రేయసిని చంపి శవాన్ని గోడలో దాచిపెట్టాడు

సారాంశం

కుటుంబాన్ని కాదని తనతో పారిపోయిన వచ్చిన యువతిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ప్రేయసి శవాన్ని అతను ఫ్లాట్ గోడలో దాచిపెట్టాడు.

ముంబై: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపి ఆమె శవాన్ని గోడ లోపల దాచిపెట్టాడు. మహారాష్ట్రలోని పల్ ఘర్ జిల్లాలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఉమ్రోలికి చెందిన అమితా మోహిత్ అనే యువతి నాలుగు నెలల క్రితం ప్రియుడు హనీఫ్ పాటెల్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఇరువురు కూడా పల్ ఘర్ జిల్లాలోని వన్ గావ్ ఏరియా వృందావన్ అపార్టమెంటులోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటూ వచ్చారు. 

అయితే, ప్రేయసీప్రియుల మధ్య ఇటీవల గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో హనీఫ్ తన ప్రియురాలిని చంపేశాడు. ఆమె శవాన్ని దాచి పెట్టడానికి ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫ్లాట్ లోనే ఓ గోడ నిర్మించి అందులో శవాన్ని పెట్టాడు. 

అమితా మోహిత్ కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తూ వచ్చాడు. వాట్సప్, ఇతర సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ ఆమె పేరు మీద టచ్ లో ఉంటూ వచ్చాడు. అయితే అమితా మోహిత్ కుటుంబ సభ్యులకు అనుమానం రానే వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆదారంగా అతన్ని పట్టుకున్నారు. 

గోడ లోపల దాచిన అమితా మోహిత్ శవాన్ని పోలీసులు గురువారంనాడు వెలికి తీశారు. శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. విచారణలో హనీఫ్ తన నేరాన్ని అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu