శ్వాస, ఛాతి నొప్పితో... కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వార్డ్ బాయ్ మృతి

Arun Kumar P   | Asianet News
Published : Jan 18, 2021, 10:41 AM ISTUpdated : Jan 18, 2021, 10:43 AM IST
శ్వాస, ఛాతి నొప్పితో... కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వార్డ్ బాయ్ మృతి

సారాంశం

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఓ వార్డు బాయ్ అనారోగ్యంతో మృతి చెందాడు. 

లక్నో: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వార్డు బాయ్ మరుసటి రోజే మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా ఆస్పత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేసే మహిపాల్ సింగ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటిరోజు టీకా తీసుకున్నాడు. కానీ ఆ మరుసటి రోజే అనారోగ్యంతో అతడు మృతి చెందాడు. దీంతో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో భయాందోళన మొదలయ్యింది. 

శనివారం మహిపాల్ సింగ్ సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్నాడు. అయితే ఆ తర్వాతిరోజు(ఆదివారం) అతడు శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఛాతినొప్పితో బాధపడ్డాడు. ఈ సమస్యలు మరింత తీవ్రమవడంతో చివరకు అతడు ప్రాణాలు వదిలాడు.

read more  వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత.. !

మహిపాల్ సింగ్ మృతిపై చీఫ్ మెడికల్ అధికారి స్పందిస్తూ... వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌ వల్లే అతడు చనిపోయాడని అనుకోవడం లేదన్నారు.  శనివారం మధ్యాహ్నం 12 గంటలకు  కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోగా ఆరోగ్యంగానే వున్నాడు. కానీ ఆ మరుసటి రోజు అనారోగ్య సమస్యలు మొదలయి చనిపోయాడు. కాబట్టి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్లే అతడు చనిపోలేదని భావిస్తున్నామన్నారు.

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో