కడుపులో నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే.. పొట్టలో వందకు పైగా వస్తువులు..!

Published : Sep 29, 2023, 11:23 AM IST
 కడుపులో నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే.. పొట్టలో  వందకు పైగా వస్తువులు..!

సారాంశం

 ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం రోగికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు, అతని కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ , రాఖీలను కూడా కనుగొన్నప్పుడు షాక్‌కు గురయ్యారు. 

ఇప్పటి వరకు మీరు చాలా వార్తలు వినే ఉంటారు.. కడుపులో నుంచి ఆ వస్తువు బయటకు తీశారు, ఈ వస్తువు బయటకు తీశారు, కొందరికి కడుపులో రాళ్లు ఉన్నాయి. ఇలా ఆపరేషన్ ద్వారా చాలా మందికి వైద్యులు వైద్యం అందించి, కడుపులోని చెత్తను బయటకు తీసి ఉంటారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి కడుపు నుంచి వందకి పైగా వస్తువులను బయటకు తీశారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.

ఓ వ్యక్తి కడుపులో నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా, అతనికి ఆపరేషన్ చేసి, చాలా వస్తువులను బయటకు తీశారు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం రోగికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు, అతని కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ  రాఖీలను కూడా కనుగొన్నప్పుడు షాక్‌కు గురయ్యారు. 

40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులకు జ్వరం, వికారం, కడుపు నొప్పితో మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స చేసిన తర్వాత కూడా  అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. రిజల్ట్ చూసి వైద్యులు కూడా షాకయ్యారు.

స్కాన్‌లో ఆ వ్యక్తి  కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీయగలిగారు.

అతని కడుపులోంచి తీసిన దాదాపు వంద వస్తువులలో ఇయర్‌ఫోన్‌లు, వాషర్లు, నట్స్ , బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, లాకెట్‌లు, బటన్‌లు, రేపర్‌లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్  సేఫ్టీ పిన్ ఉన్నాయి.

ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ, తమకు ఇలాంటి కేసు ఎదురవడం ఇదే మొదటిదని చెప్పారు. సదరు బాధితుడు  రెండేళ్లుగా కడుపు సమస్యలతో బాధపడుతున్నాడని, అతని శరీరం నుండి అన్ని వస్తువులను తొలగించినప్పటికీ, వ్యక్తి పరిస్థితి నిలకడగా లేదని డాక్టర్ చెప్పారు. ఆ వస్తువులు చాలా కాలం పాటు అతని కడుపులో ఉన్నాయని, దాని వల్ల అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని చెప్పారు.

ఆ వ్యక్తి కుటుంబం వారు కూడా కనుగొన్న వాటిని చూసి ఆశ్చర్యపోయామని, ఆ వస్తువులను ఆయన ఎప్పుడ మింగాడో కూడా తమకు తెలీదన్నారు. అతను వస్తువులను ఎలా తినగలిగాడు అనే దాని గురించి అతని తల్లిదండ్రులకు ఎటువంటి క్లూ లేదు, కానీ అతను మానసిక వ్యాధులతో బాధపడుతున్నాడని తెలుస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu