ఓ వ్యక్తి ఉన్మాదం: ఐదుగురు కుటుంబసభ్యుల్ని చంపి.. ఆత్మహత్య

Siva Kodati |  
Published : Aug 03, 2019, 01:21 PM IST
ఓ వ్యక్తి ఉన్మాదం: ఐదుగురు కుటుంబసభ్యుల్ని చంపి.. ఆత్మహత్య

సారాంశం

సొంత కుటుంబ సభ్యుల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని బాఘపుర ఠాణా పరిధిలోని నథువాల్ అనే గ్రామానికి చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి తన నానమ్మ, తల్లి, తండ్రి, సోదరితో పాటు తన మూడేళ్ల కూతురిని తుపాకీతో కాల్చి చంపాడు

సొంత కుటుంబ సభ్యుల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని బాఘపుర ఠాణా పరిధిలోని నథువాల్ అనే గ్రామానికి చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి తన నానమ్మ, తల్లి, తండ్రి, సోదరితో పాటు తన మూడేళ్ల కూతురిని తుపాకీతో కాల్చి చంపాడు.

అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే ఘటనలో సందీప్ తాతయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే తన సందీప్ ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamil Nadu Assembly: మిళనాడు అసెంబ్లీలో రచ్చ ఉదయనిధి vs పళనిస్వామి | Asianet News Telugu
CM Vijay Fire Speech in Assembly: సీఎం విజయ్ స్పీచ్ కిదద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet Telugu