మైనర్ కూతురి మీద కన్నతండ్రి అత్యాచారం.. ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిల్.. బీహార్ లో హేయమైన ఘటన...

By SumaBala BukkaFirst Published Dec 13, 2021, 11:46 AM IST
Highlights

ఈ కేసులో మైనర్ బాలిక మీద తండ్రి molestationకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మైనర్ బాలిక మీద నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై నిందితుడు బాలికకు ఫోన్ చేసి మళ్లీ రావాలని కోరారని ఎఫ్ఐఆర్ లో తల్లి పేర్కొంది. లేని పక్షంలో వీడియో అందరికీ పంపుతానని బెదిరించినట్లు తెలిసింది. 

బీహార్ : Muzaffarpur జాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో Minor daughter మీద తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ చాందిని కుమారి సవారియా గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు దర్యాప్తులో బాలిక చేసిన ఆరోపణలు నిజమని తేలింది. 

ఈ కేసులో తండ్రీ కూతుళ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు ఘటన మీద మహిళా పోలీసులకు సమాచారం అందించారు. Women Police Station కు చెందిన పోలీస్ అధికారులు అర్థరాత్రి వారిద్దరినీ తమతో తీసుకెళ్లారు. గత శనివారం బాధితురాలు కోర్టులో Testimony దాఖలు చేసిన తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి, బాధితురాలి తండ్రిని కోర్టుకు అప్పగించారు. 

ఈ కేసులో మైనర్ బాలిక మీద తండ్రి molestationకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మైనర్ బాలిక మీద నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై నిందితుడు బాలికకు ఫోన్ చేసి మళ్లీ రావాలని కోరారని ఎఫ్ఐఆర్ లో తల్లి పేర్కొంది. లేని పక్షంలో వీడియో అందరికీ పంపుతానని బెదిరించినట్లు తెలిసింది. 

ఈ ఘటన మీద గ్రామంలో మూడు రోజులుగా సెటిల్ మెంట్ కు ప్రయత్నించారు. ఐతే గ్రామానికి చెందిన 15 మంది నిందితుడిని కర్రలు, రాడ్లతో దేహశుద్ధి చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కూతురి మీద అత్యాచారానికి పాల్పడుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమని పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు. 

గర్భశోకంలో ఉన్న కన్న కూతురిపై.. కొడుకు ముందే తండ్రి అత్యాచారం, ఆపై గొంతు నులిమి...

ఇదిలా ఉండగా, కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవాల్సిన తండ్రి.. దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిపైనే కామాంధుడిలా మారి.. దారుణానికి పాల్పడ్డాడు. ఏడాదిన్నరగా.. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. ఇతనికి కుమార్తె(13), కుమారుడు (11) సంతానం ఉన్నారు. కాగా కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. కాగా, తండ్రి గత ఏడాది మార్చి నుంచి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడు.

భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. భార్య ఇంట్లో లేనప్పుడల్లా అత్యాచారం చేస్తున్నాడు. ఈ నెల 8, 10వ తేదీల్లోనూ అత్యాచారం చేయడంతో భరించలేని కుమార్తె.. తాను ఇక్కడ ఉండలేనని నానమ్మ ఇంటికి వెళ్లిపోతానని తల్లికి చెప్పింది. కారణం ఏంటని తల్లి నిలదీయడంతో.. అసలు విషయం బయటపడింది.  

తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆమె చెప్పడం గమనార్హం. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం ప్రకారం.. ఆమె కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!