పది రోజుల పాటు విశ్రాంతి తప్పని సరి.. మమతా బెనర్జీకి వైద్యుల సలహా.. అసలేమైందంటే..?

Published : Sep 25, 2023, 01:58 AM IST
 పది రోజుల పాటు విశ్రాంతి తప్పని సరి.. మమతా బెనర్జీకి వైద్యుల సలహా.. అసలేమైందంటే..?

సారాంశం

Mamata Banerjee:  స్పెయిన్, దుబాయ్ పర్యటించిన  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె ఆదివారం సాయంత్రం ఆరోగ్య పరీక్ష కోసం.. ఆమె ప్రభుత్వ SSKM ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని మమతా బెనర్జీకి వైద్యులు సూచించారు. 

Mamata Banerjee:  ప్రతికూల వాతావరణం కారణంగా మమతా బెనర్జీ ఆరోగ్యం క్షీణించింది. స్పెయిన్, దుబాయ్‌లలో 12 రోజుల పర్యటన అనంతరం బెంగాల్ తిరిగి వచ్చింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరీక్ష కోసం ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోని SSKM ఆసుపత్రిని సందర్శించారు. మమతా బెనర్జీని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్‌లోని వుడ్‌బర్న్ బ్లాక్‌లో వైద్యులు పరీక్షించారని ఓ అధికారి తెలిపారు. రొటీన్ చెకప్ కోసం ఆమె వచ్చారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మమత హెల్త్ చెకప్ కోసం కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి చేరుకున్నారని, అక్కడ వుడ్‌బర్న్ బ్లాక్‌లోని వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐతో సహా అనేక పరీక్షలు చేశారని  తెలిపారు.
 
ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు మాట్లాడుతూ.. “గత వారం విదేశీ పర్యటనలో మమతా బెనర్జీకి ఎడమ మోకాలికి గాయమైంది. ఈ ఏడాది మొదట్లో హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అవుతుండగా అదే మోకాలికి గాయమైంది...కొన్ని పరీక్షల తర్వాత కదలిక రాకుండా 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం " అన్నారు. బెనర్జీ హెలికాప్టర్‌లో దిగుతున్నప్పుడు గాయపడ్డారని ముఖ్యమంత్రికి సన్నిహిత వర్గాలు తెలిపాయి.ప్రతికూల వాతావరణం కారణంగా సెవోక్ ఎయిర్‌స్ట్రిప్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. జూన్‌లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ఎడమ మోకాలిలో స్నాయువు గాయంతో మైక్రోసర్జరీ చేయించుకోవలసి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులను పెంచేందుకు స్పెయిన్ , దుబాయ్‌లలో 12 రోజుల అధికారిక పర్యటన తర్వాత బెనర్జీ శనివారం సాయంత్రం కోల్‌కతాకు తిరిగి వచ్చారు.

శ్రీలంక అధ్యక్షుడితో భేటీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల దుబాయ్ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. ఈ సమయంలో విక్రమసింఘే ఆమెను భారతదేశంలో ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తారా? ప్రశ్నించగా.. దీనిపై మమత స్పందిస్తూ.. అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. నవంబర్‌లో జరిగే వ్యాపార సదస్సుకు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేను మమత ఆహ్వానించారు. మమత 12 రోజుల పర్యటన కోసం దుబాయ్, స్పెయిన్‌లో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!