కార్యకర్తలకు స్వయంగా టీ చేసి ఇచ్చిన సీఎం..వీడియో వైరల్

Published : Aug 22, 2019, 09:59 AM IST
కార్యకర్తలకు స్వయంగా టీ చేసి ఇచ్చిన సీఎం..వీడియో వైరల్

సారాంశం

ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగి ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణదారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు. 

కార్యకర్తల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా టీ తయారు చేసి ఇచ్చారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ఆ ముఖ్యమంత్రి ఎవరో కూడా మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. మరెవరో కాదు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె ఎప్పుడూ సాదా సీదాగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా... ఈసారి ఆమె చేసిన పనికి మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగి ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణదారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు.

సీఎం చేసిన ఆ పనికి ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో సెక్యూరిటీ అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పి అక్కడున్న వారితో కాసేపు మాట్లాడిన అనంతరం సీఎం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వీడియోను మమత తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా... ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌