Mamata Banerjee: దేశాన్ని విభ‌జించే కుట్ర జ‌రుగుతోంది.. అమిత్ షా పై దీదీ ఆగ్ర‌హం

Published : May 06, 2022, 12:39 AM IST
Mamata Banerjee: దేశాన్ని విభ‌జించే కుట్ర జ‌రుగుతోంది.. అమిత్ షా పై దీదీ ఆగ్ర‌హం

సారాంశం

Mamata Banerjee: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  బెంగాల్‌లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమ‌ర్శించింది. ఢిల్లీలోని జహంగీర్‌పురి, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో హోంమంత్రి చూడాలనీ, బెంగాల్‌ గురించి ఆలోచించొద్దని హితవు పలికారు. విభజన సృష్టించడమే బీజేపీ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.    

Mamata Banerjee: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత హింసను ఎందుకు చూడడం లేదని, అక్కడి మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్‌లో పరిస్థితిపై అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నారు.

 ఈ సంద‌ర్బంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ బెనర్జీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లా కాకుండా..  తమ ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సవరించిన పౌరసత్వ చట్టం అంశాన్ని లేవనెత్తడం ద్వారా బిజెపి దేశ పౌరులను అవమానించిందని ఆరోపించారు. ఓటు వేసే ప్రతి వ్యక్తి దేశ పౌరుడని వ్యాఖ్యానించింది. 

రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో పర్య‌టిస్తున్నారు.  గురువారం సిలిగురి నగరంలో జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ 'దుష్పరిపాలన జ‌రుగుతోంద‌ని, ఆ మ‌మ‌తా బెన‌ర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. మమ‌తా  వివిధ సంఘటనల తర్వాత కేంద్రం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి),  ఇతర బృందాలను పశ్చిమ బెంగాల్‌కు పంపుతోందని, అయితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో హింసాత్మకమైన జహంగీర్‌పురిలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగాలీ మరియు హిందీ మాట్లాడే వర్గాల మధ్య, హిందువులు, ముస్లింల మధ్య విభజన సృష్టించాలని  అమిత్  షా కోరుకుంటున్నారని దీదీ అన్నారు. బీజేపీ వాళ్లు దయచేసి నిప్పుతో ఆడుకోవద్దని వార్నింగ్ టోన్‌లో మమత అన్నారు.  

ముఖ్యమైన విషయం ఏమిటంటే, సరిహద్దు భద్రతా దళం యొక్క కార్యక్రమంలో.. స్థానిక పరిపాలన సహకారం లేకుండా చొరబాట్లు, స్మగ్లింగ్‌ను అరికట్టడం కష్టమని షా అన్నారు. ఈ ప్రకటనపై బెనర్జీ స్పందిస్తూ.. రాష్ట్ర అధికారులను విస్మరించమని సరిహద్దు గార్డులను కేంద్ర హోంమంత్రి కోరకూడదని అన్నారు. బీఎస్‌ఎఫ్ అంటే తనకు ఎంతో గౌరవమని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. స్మగ్లింగ్ చొరబాట్లను అరికట్టడమే మీ (బిఎస్ఎఫ్) విధి అని ఆయన అన్నారు. సరిహద్దును రక్షించడం మీ కర్తవ్యం అన్నారు.

కరోనా మహమ్మారి ముగిసిన వెంటనే CAAని అమలు చేస్తామని షా చేసిన ప్రకటనపై మ‌మ‌తా బెనర్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మరోసారి CAA, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రత్యేక ఉత్తర బెంగాల్ కోరుకునే తన బిజెపి ఎమ్మెల్యేలు/ఎంపిల డిమాండ్‌పై షా మొదట స్పందించాలని బెనర్జీ అన్నారు. బెంగాల్ ప్రజలు దీనిని ఎప్పటికీ అనుమతించరని తేల్చి చెప్పింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?