హిమాచల్, ఉత్తరాఖండ్‌లో త్వరలో భారీ భూకంపాలు.. ! శాస్తవేత్తల హెచ్చరిక.. !!

Published : Feb 22, 2023, 12:16 PM IST
హిమాచల్, ఉత్తరాఖండ్‌లో త్వరలో భారీ భూకంపాలు.. ! శాస్తవేత్తల హెచ్చరిక.. !!

సారాంశం

భారత్ లో పెద్ద భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త, భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు అన్నారు. 

హైదరాబాద్ : భారత టెక్టోనిక్ ప్లేట్ ప్రతి సంవత్సరం సుమారు 5 సెం.మీ కదులుతుందని, దీనివల్ల హిమాలయాల వెంబడి ఒత్తిడి పెరిగిపోతోందని.. దీనివల్ల రాబోయే రోజుల్లో పెను భూకంప సంఘటనలు,  భూకంపాలు వచ్చే అవకాశం పెరుగుతుందని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, భూగర్భ నిపుణుడు ఒకరు హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) ప్రధాన భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మంగళవారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. 'భూ ఉపరితలం నిరంతరం కదలికలో ఉండే వివిధ పలకలను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం 5 సెం.మీ. మేర భారత్ లో ఈ పలకలు కదులుతున్నాయి. ఫలితంగా హిమాలయాల వెంట ఒత్తిడి పేరుకుపోతుంది. దీనివల్ల పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం పెరుగుతుంది."

పాకిస్థాన్ ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు.. వైరల్ అవుతున్న ‘‘26/11 అటాకర్స్’’ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్

"మాకు ఉత్తరాఖండ్‌లో 18 సీస్మోగ్రాఫ్ స్టేషన్ల బలమైన నెట్‌వర్క్ ఉంది. హిమాచల్, ఉత్తరాఖండ్‌తో సహా నేపాల్ పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరం అని పిలువబడే ప్రాంతం, ఎప్పుడైనా సంభవించే భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది" అని ఆ శాస్త్రవేత్త తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి 10.38 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని ఏజెన్సీ తెలిపింది. నిన్న రాత్రి 10:38 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం యొక్క లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది,"  ఎన్ సీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా, సిక్కింలో ఫిబ్రవరి 13 ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఆ రోజు ఉదయం 4.15 గంటలకు సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 12 మధ్యాహ్నం అస్సాంలోని నాగోన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక రోజు తర్వాత ఈ భూకంపం రావడం గమనార్హం. ఒక రోజు ముందు, గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu