తండ్రీ కొడుకులతో పాటు కోడల్ని కాల్చి చంపారు.. ఇంతకీ ఏమైందంటే..?  

Published : Jun 20, 2023, 12:11 AM IST
తండ్రీ కొడుకులతో పాటు కోడల్ని కాల్చి చంపారు.. ఇంతకీ ఏమైందంటే..?  

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ట్రిపుల్ మర్డర్‌తో కలకలం రేగింది. తండ్రీ కొడుకులతో పాటు కోడలు కాల్చి చంపబడ్డారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.   

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో సోమవారం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కర్హల్‌లోని నాగ్లా అతిరామ్ గ్రామంలో రోడ్డు విషయంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య వివాదం చెలారేగింది. ఈ వివాదంలో ఓ మహిళతో సహా తండ్రీ కొడుకులు సోమవారం కాల్చి చంపబడ్డారు. హత్యాకాండ అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి ఎస్పీ వినోద్‌కుమార్‌, ఏఎస్పీ రాజేష్‌కుమార్‌తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

దారి విషయమై కుటుంబీకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నాగ్లా అతిరామ్ గ్రామ నివాసితులు కాయం సింగ్, సోబ్రాన్ సింగ్ ఒకే కుటుంబానికి చెందినవారు. ఇద్దరి ఇళ్లు దగ్గరలోనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదంపై సోమవారం సోబ్రాన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కాయం సింగ్ (50), అతని తండ్రి రామేశ్వర్ సింగ్ (75), మమత (27) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో తీవ్రంగా మహిళ కూడా గాయపడింది. ఆమెను సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. హత్య తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో  పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu