Maharashtra Politics: శివ‌సేన‌పై నియంత్ర‌ణ ఎవ‌రిదీ ? సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గం.. 

Published : Jul 25, 2022, 12:56 PM IST
Maharashtra Politics: శివ‌సేన‌పై నియంత్ర‌ణ ఎవ‌రిదీ ? సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గం.. 

సారాంశం

Maharashtra Politics:మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలను వ్య‌తిరేకిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) వర్గం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే వరకు పార్టీపై ఎవరి నియంత్రణ ఉండాల‌నే విష‌యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకుండా ఆపాలని ఉద్ధవ్ ఠాక్రే  వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

Maharashtra Politics: మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తాజాగా మ‌రోసారి వివాదం తెర మీదికి వ‌చ్చింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) వర్గం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే వరకు పార్టీపై ఎవరి నియంత్రణ ఉండాల‌నే విష‌యంలో  ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకుండా ఆపాలని ఉద్ధవ్ ఠాక్రే  వర్గం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ క్ర‌మంలో పిటిషన్ దాఖలు చేసింది. 

అంత‌కుముందే.. నిజమైన శివసేన త‌మ‌దేన‌నీ సీఎం ఏకనాథ్ షిండే వర్గం వేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం విచారణను నిలిపివేయాలని కోరింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు అసలు శివసేన ఎవరిదో అనే విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని ఉద్ధవ్ వర్గం అంటోంది. 

శివసేనలో చీలిక వ‌చ్చిందనీ, అందులో ఒక గ్రూపుకు ఏక్‌నాథ్ షిండే నాయకత్వం వహిస్తుండగా, మరో గ్రూపుకు ఉద్ధవ్ థాకరే నాయకత్వం వహిస్తున్నారని, రెండు గ్రూపులు తమదే నిజమైన శివసేన అని ఆరోపిస్తున్నాయి. దీనిపై స్పందించిన  ఎన్నిక‌ల సంఘం.. శనివారం నాడు రెండు వ‌ర్గాల‌కు నోటీసులు పంపించింది. ఆగస్టు 8లోగా  పార్టీ నియంత్రణకు డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోరింది. పార్టీలో కొనసాగుతున్న నిరసనల‌ కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా ఎన్నికల సంఘం ఇరువర్గాలను కోరింది. 

తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాల‌ను ఉద్ద‌వ్ వ‌ర్గం సవాలు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను రాజ్యాంగ విరుద్ధమైన, తొందరపాటు నిర్ణయమని ఉద్ధవ్ వర్గం అభివర్ణిస్తోంది. ఈ క్ర‌మంలో ఉద్ద‌వ్ థాకరే వ‌ర్గానికి చెందిన‌ శివసేన ప్రధాన కార్యదర్శి సుభాష్‌ దేశాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. షిండే వర్గం చట్టవిరుద్ధంగా త‌మ సంఖ్య‌బలాన్ని పెంచుకుంద‌నీ, పార్టీపై అధిప‌త్యం సంపాదించుకోవడానికి కృత్రిమ మెజారిటీని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందుకు సాగితే..  ఠాక్రే వర్గానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఇది న్యాయ విచారణలో జోక్యం చేసుకుంటుంది, న్యాయస్థానం ముందు సబ్ జడ్జిగా ఉన్న విషయాన్ని దర్యాప్తు చేస్తుంది. కనుక ఇది కోర్టు ధిక్కారానికి సమానం.

అంతకుముందు..సిఎం ఏక్‌నాథ్ షిండే.. ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో..త‌మ‌కు 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది  మద్దతుగా ఉన్నారని. షిండే టీమ్‌కు పార్టీ గుర్తులను కేటాయించి ఎన్నికల్లో పాల్గొనే రాజ్యాంగ బ‌ద్ద హ‌క్కుల‌ను క‌ల్పించాల‌ని ఎన్నిక‌ల సంఘానికి రాసిన‌ లేఖలో పేర్కొన్నారు.


కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీపై దావా వేసిన విషయం తెలిసిందే.  ఏక్నాథ్ షిండే శరవేగంగా ఎదుగుతున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే ఆయన శివ‌సేన‌( బాణాన్ని)ను తన వశం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నియమించిన శివసేన జాతీయ కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఏకనాథ్ షిండే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. 

విశేషమేమిటంటే.. బిజెపి సహాయంతో, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై ఏకనాథ్ షిండే తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఉద్ధవ్‌ను అధికారం నుంచి దించి ఆయనే స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ ఎవ‌రికి సొంత‌మ‌వుతుందో వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu