తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం

Published : Jul 02, 2021, 09:33 AM IST
తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని  పిల్లలు అదృశ్యమయ్యారు.  ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని  పిల్లలు అదృశ్యమయ్యారు.  ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ట్రస్టులో ఉంటున్న తన కొడుకును చూసేందుకు ఓ తల్లి ఇటీవలనే ఆశ్రమానికి వచ్చింది. అయితే  కరోనాతో ఆ బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులకు ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు.  అయితే వారం రోజుల క్రితమే ఆ పిల్లాడిని ట్రస్టు నిర్వాహకులు రూ. 5 లక్షలకు విక్రయించారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.ఈ విచారణలో ట్రస్టు నుండి పెద్ద ఎత్తున పిల్లలు మాయమయ్యారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 16కి పైగా  పిల్లలు అదృశ్యమయ్యారని గుర్తించారు. ఈ పిల్లల అదృశ్యానికి సంబంధించి సరైన సమాచారాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఇవ్వలేదు.  ట్రస్టు నిర్వాహకులు రెండు మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆశ్రమం  నుండి పిల్లల అదృశ్యం వెనుక ఏదైనా ముఠా హఃస్తం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌