పళినిస్వామికి కోర్టు షాక్: సీబీఐ విచారణకు ఆదేశం

Published : Oct 12, 2018, 03:47 PM IST
పళినిస్వామికి కోర్టు  షాక్: సీబీఐ విచారణకు ఆదేశం

సారాంశం

తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై  సీబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు  శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై  సీబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు  శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

మూడు రోజుల క్రితమే  తమిళనాడు సీఎం  పళనిస్వామికి విజిలెన్స్ డైరెక్టర్, అవినీతి నిరోధక శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది.  ఈ క్లీన్ చిట్ ఇచ్చిన  మూడు రోజులకే  మద్రాసు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

తమిళనాడు సీఎం పళనిస్వామిపై అవినీతి ఆరోపణలపై డీఎంకె నేతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం నాడు మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  మద్రాస్ హైకోర్టు జడ్జి ఎ.డి. జగదీష్ చంద్ర ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం నాడు  ఆాదేశాలు జారీ చేశారు.  

పళనిస్వామి రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణానికి  కాంట్రాక్టులపై  సీబీఐ  విచారణకు ఆదేశించింది.ఈ విషయమై డీఎంకె నేతలు కోర్టును ఆశ్రయించారు. వేలాది కోట్ల రూపాయాల విలువైన కాంట్రాక్టులను   తన బంధువులు, స్నేహితులకు  సీఎం పళనిస్వామి కట్టబెట్టినట్టు  ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణలపై  డీఎంకె నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో   సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


 

PREV
click me!

Recommended Stories

Viral Video : మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..? ఈమె చేసింది కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారంటే
పాకిస్థాన్‌కు ఇక ద‌బిడి దిబిడే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ఆర్మీ. రంగంలోకి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్స్‌