ఇద్దరమ్మాయిల మధ్య లవ్: ఇంటి నుండి జంప్, కోర్టుకు

Published : Apr 01, 2021, 02:03 PM IST
ఇద్దరమ్మాయిల మధ్య లవ్: ఇంటి నుండి జంప్, కోర్టుకు

సారాంశం

ఇద్దరమ్మాయిలు సహజీవనం చేసేందుకు సిద్దమయ్యారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఇద్దరమ్మాయిలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

చెన్నై: ఇద్దరమ్మాయిలు సహజీవనం చేసేందుకు సిద్దమయ్యారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఇద్దరమ్మాయిలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇద్దరమ్మాయిల మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది.  వీరిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.  ఈ విషయం తెలిసిన ఇద్దరి పేరేంట్స్ వీరిని విడదీసేందుకు ప్రయత్నించారు.తల్లిదండ్రుల నుండి తప్పించుకొన్న వీరిద్దరూ చెన్నైలోని ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించారు.ఈ స్వచ్ఛంధ సంస్థ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తమకు భద్రత కల్పించాలని కోరారు. తమ గురించి ఎందుకని వారు ప్రశ్నించారు. 

ఈ పిటిషన్ ను బుధవారం నాడు హైకోర్టు  విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను విన్న హైకోర్టు ఇప్పటికిప్పుడు ఈ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఈ తరహా కేసుల్లో  ఇదివరకు కోర్టులు ఇచ్చిన  తీర్పులను పరిశీలిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఇద్దరు యువతులు, వారి కుటుంబసభ్యులు వాంగ్మూలాలను కోర్టు వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.  

ఈ విషయమై సమగ్ర విచారణతో ఏప్రిల్ 26వ తేదీన కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకర్ ను కోర్టు ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result