రెండు బ‌స్సులు ఢీ .. ఒక‌రు మృతి, 41 మంది గాయాలు

Published : Dec 16, 2022, 12:55 AM IST
రెండు బ‌స్సులు ఢీ .. ఒక‌రు మృతి, 41 మంది గాయాలు

సారాంశం

Indore: మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గాయ‌ప‌డ్డారు. ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.  

Madhya Pradesh Road Accident: మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గాయ‌ప‌డ్డ‌రు. ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్-ఖండ్వా రహదారిపై గురువారం రెండు ప్ర‌యివేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 25 ఏళ్ల ప్రయాణీకుడు మరణించగా, మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని చికిత్స కోసం ఇండోర్ లోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. 

చికిత్స పొందుతూ ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందినట్లు ఎంవైహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమేంద్ర ఠాకూర్ తెలిపారు. మృతుడు ఖండ్వా జిల్లాకు చెందిన రాహుల్ (25)గా గుర్తించినట్లు ఠాకూర్ తెలిపారు. గాయపడిన 41 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఖాండ్వా నుంచి ఇండోర్ వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్నానని ప్రత్యక్ష సాక్షి సునీల్ కుమార్ శుక్లా తెలిపారు. బస్సు ప్రయాణికులతో నిండిపోయి అధిక వేగంతో కదులుతోంది. ఒక వాహనాన్ని దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అది వ్యతిరేక దిశ నుండి వస్తున్న మరొక బస్సును ఢీకొట్టింది. సహాయం కోసం కేకలు వేస్తున్న చాలా మంది ప్రయాణీకులు గాయపడ్డారని తెలిపారు. 

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే, ఈ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ.50 వేలు, స్వ‌ల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu