మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ మృతి..

Published : Mar 12, 2023, 01:45 PM IST
మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ మృతి..

సారాంశం

మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలత దీక్షిత్ తన 91 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాధురీ దీక్షిత్ కు తన తల్లితో ఎనలేని అనుబంధం ఉంది. పలు ఇంటర్వ్యూలలో ఆమె తన తల్లి గురించి ప్రస్తావించారు. 

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ ఈ రోజు ఉదయం 8:40 గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 91 ఏళ్లు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్లీలోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ‘‘మా ప్రియమైన ఆయి స్నేహలతా దీక్షిత్ ఈ రోజు ఉదయం తన ప్రియమైనవారితో కలిసి ప్రశాంతంగా కన్నుమూశారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. 113 రోజుల తర్వాత 500 దాటిన కేసులు.. కేంద్రం అప్రమత్తం

తల్లితో తనకున్న అనుబంధం గురించి మాధురీ దీక్షిత్ తరచూ మాట్లాడుతుంటారు. తాను విజయవంతమైన నటిగా మారిన తర్వాత కూడా తన పట్ల తన తల్లి ప్రవర్తనలో మార్పు రాలేదని, తన గది అస్తవ్యస్తంగా ఉంటే తనను తిట్టేదని ఆమె ఒకసారి వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాధురి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా, నా గది అస్తవ్యస్తంగా ఉంటే మా అమ్మ నన్ను తిట్టేది. నన్ను అలా పెంచారు. నేను అలానే ఉన్నాను.’’ అని చెప్పారు. 

గత ఏడాది తన తల్లి 90వ పుట్టినరోజు సందర్భంగా మాధురీ దీక్షిత్ సోషల్ మీడియాలో ఓ ప్రేమపూర్వక లేఖ రాశారు. ‘‘హ్యాపీ బర్త్ డే ఆయ్! తల్లి కూతురికి బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంటారు. కానీ అవి అంతగా సరైనవి కావు. నువ్వు నా కోసం చేసిన ప్రతి దాంట్లో, మీరు నేర్పిన పాఠాలు నాకు పెద్ద బహుమతి. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం ఉండాలని నేను కోరుకుంటున్నాను.’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్ లో మాధురి తన తల్లికి సంబంధించిన అరుదైన చిత్రాలను షేర్ చేశారు.

2018లో మాధురీ దీక్షిత్ తొలిసారిగా ఓ పాట కూడా పాడింది. మాధురి తల్లి స్నేహలతా దీక్షిత్ శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని. 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో నటించిన రంగి సరి గులాబి చునారియా అనే జానపద గీతాన్ని సౌమిక్ సేన్ స్వరపరిచారు. కాగా.. మాధురీ దీక్షిత్ 2013లో తన తండ్రి శంకర్ ఆర్ దీక్షిత్ ను కోల్పోయింది. ఆయన కూడా తన 91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో గతేడాది సెప్టెంబర్ లో కన్నుమూశారు.
 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu