టార్గెట్ బీజేపీ.. ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఆప్ ప్ర‌క‌ట‌న

By Mahesh RajamoniFirst Published Dec 12, 2022, 11:58 PM IST
Highlights

Lucknow: ఇటీవల జరిగిన ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, ఆప్ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. యూపీలోని సివిక్ పోల్స్ లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. 
 

Uttar Pradesh civic polls : ఇటీవ‌లే జాతీయ పార్టీగా అవ‌త‌రించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. దూకుడుగా ముందుకు సాగుతోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ టార్గెట్ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. యూపీ పౌర ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ఆప్ ప్ర‌క‌టించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, ఆప్ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. యూపీలోని సివిక్ పోల్స్ లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. లక్నోలోని ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ, ఎంసీడీ ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పౌర ఎన్నికలపైనే ఉందని అన్నారు. దాదాపు 12,000 వార్డులు, 763 యూనిట్లు ఉన్నాయనీ, వాటిపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని సంజయ్ సింగ్ చెప్పారు.

"మున్సిపాలిటీలో ప్రబలంగా ఉన్న అవినీతిని అంతం చేయడమే మా అతిపెద్ద సమస్య" అని సంజయ్ సింగ్ అన్నారు, "నీటి పన్ను, వాణిజ్య పన్నుల పేరుతో అవినీతి వ్యాప్తి చెందుతుంది. దీనిని ఆమ్ ఆద్మీ పార్టీ అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవినీతి రహిత మున్సిపాలిటీ అనేది మా నినాదం" అని సంజ‌య్ సింగ్ పేర్కొన్నారు. “ప్రజలు కేంద్రంలో ప్రధాని మోడీకి, రాష్ట్రంలో సీఎం యోగికి అవకాశం ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న అపరిశుభ్రత, అది కనిపించే అపరిశుభ్రమైనా లేదా అవినీతిలో ఇమిడి ఉన్న డిపార్ట్‌మెంటల్ మురికి అయినా, వీటన్నింటిని తుడిచిపెట్టే అవకాశం ఆప్ కు ఇవ్వాలని” సంజ‌య్ సింగ్ ప్ర‌జ‌ల‌ను కోరారు. 

15 ఏళ్లుగా ఢిల్లీలో సాగుతున్న బీజేపీ దుష్టపాలనను ఈసారి ఢిల్లీ ప్రజలు అంతం చేశారని ఆప్ నేత సంజ‌య్ సింగ్ అన్నారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 13 శాతం ఓట్లు వచ్చాయనీ, అంటే ఆ పార్టీకి 41 లక్షల ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. “ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి, మాకు వివిధ రాష్ట్రాలు-జిల్లాల్లో కార్యాలయాలు ఉండటానికి కారణం అదే. లక్నోలో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కార్యాలయానికి వస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు.

అలాగే, "లఖింపూర్ కేసులో ఏడాదిలోపే పలువురు సాక్షులపై దాడులు జరిగాయి. మంత్రి తన పదవిలో కొనసాగితే, దర్యాప్తు కూడా ప్రభావితమవుతుందనీ, సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని మేము మొదటి రోజు నుండి చెప్పాము. ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని నేను గౌరవ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తాను" అని అన్నారు.

 

लखीमपुर कांड में एक वर्ष के अंदर कई गवाहों पर हमले हो चुके है।

अगर मंत्री अपने पद पर बना रहेगा तो जांच भी प्रभावित होगी और गवाहों की जान को खतरा भी रहेगा, ये हमने पहले दिन से ही कहा था।

मैं माननीय सर्वोच्च न्यायालय से अपील करूंगा इस मामले का स्वत: संज्ञान लें।

: pic.twitter.com/cL4bZqUBHw

— Aam Aadmi Party- Uttar Pradesh (@AAPUttarPradesh)

 

 

click me!