సామాన్యులకు గ్యాస్ షాక్... పెరిగిన సిలిండర్ ధర

Published : Sep 02, 2019, 08:31 AM ISTUpdated : Sep 02, 2019, 03:44 PM IST
సామాన్యులకు గ్యాస్ షాక్... పెరిగిన సిలిండర్ ధర

సారాంశం

నెలరోజుల క్రితం వంటగ్యాస్‌ ధర తగ్గిందని సంతోషించినా నెలతిరిగే సరికి మళ్లీ ధర పెంచేశారు. నెలరోజులకోసారి ధరల సమీక్ష జరుగుతుంది. తాజాగా ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం లిక్విడ్‌పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పిజి) సిలిండర్‌ధర 16 రూపాయలు పెరిగినట్టు ప్రభుత్వ రంగ రిటైల్‌సంస్థలు ప్రకటించాయి.

సామాన్యులు, మధ్యతరగతి కుటుంబసభ్యులకు ఊహించని షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నెలరోజుల క్రితం వంటగ్యాస్‌ ధర తగ్గిందని సంతోషించినా నెలతిరిగే సరికి మళ్లీ ధర పెంచేశారు. నెలరోజులకోసారి ధరల సమీక్ష జరుగుతుంది. తాజాగా ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం లిక్విడ్‌పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పిజి) సిలిండర్‌ధర 16 రూపాయలు పెరిగినట్టు ప్రభుత్వ రంగ రిటైల్‌సంస్థలు ప్రకటించాయి.

 ప్రస్తుతం సిలిండర్‌ధర 628 రూపాయలుఉండగా పెరిగినధరలో 644 రూపాయలకుచేరింది. కాగా ఢిల్లీలో మాత్రం సిలిండర్‌పై 15.50 రూపాయలు పెరిగినట్టుతెలిపారు. ప్రతినెలా 1వతేదీన ఆయిల్‌కంపెనీలు ఎల్‌పిజి ధరల సై సమీక్ష నిర్శహిస్తున్నాయి. 

ఈసారి అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌పై రూపాయి మారకం తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధర పెంచాల్సి వచ్చిందని ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి.కాగా పెరిగిన ధర ఆదివారం నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించాయి.
 

PREV
click me!

Recommended Stories

ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia
ఆస్ట్రేలియా పర్యటనలో మోదీ సినిమా రేంజ్ లో స్వాగతం | PM Modi Arrives in Melbourne, Australia