ఆమెకి ఇద్దరు : మండపంలో ప్రియుడ్ని వదిలేసి.. మరో ప్రియుడితో జంప్...!

By AN TeluguFirst Published Feb 11, 2021, 9:42 AM IST
Highlights

వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులూ వీరి ప్రేమను అంగీకరించారు. తీరా పెళ్లి పెట్టుకునేసరికి ప్రేయసి మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అంతే ముందు ప్రేమించిన కాబోయే భర్తకు హ్యాండించి పెళ్లినుంచి రెండో ప్రేమికుడితో జంప్ అయ్యింది. విచిత్రంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులూ వీరి ప్రేమను అంగీకరించారు. తీరా పెళ్లి పెట్టుకునేసరికి ప్రేయసి మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అంతే ముందు ప్రేమించిన కాబోయే భర్తకు హ్యాండించి పెళ్లినుంచి రెండో ప్రేమికుడితో జంప్ అయ్యింది. విచిత్రంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

చెన్నై, నుంగంబాక్కంకు చెందిన 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు అక్కడే పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన ఓ యువకుడితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇది ఇంట్లో తెలిసి ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి.  

బుధవారం ఉదయం ఓ కల్యాణమండపంలో వివాహం చేసే ఏర్పాట్లు కూడా జరిగాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి వధూవరులు రిసెప్షన్ కూడా జరిగింది. వీరిద్దరూ బంధువులు, స్నేహితుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 
ధూవరులు కల్యాణ మండపంలోని వేర్వేరు గదుల్లో బసచేశారు. 

అర్థరాత్రి 2 గంటల సమయంలో అమ్మాయి తల్లి గదిలోకి వెళ్లి చూసింది. కూతురు కనిపించలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లి మిగతావారికి విషయం చెప్పింది. ఆమె కోసం కల్యాణమండపం, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నాలుగేళ్లు ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోవాల్సిన వధువు, ఆఖరి క్షణంలో వధువు మరో ప్రియుడితో వెళ్లిపోయిందనే వార్త బంధువులు, స్నేహితుల మధ్య కలకలం రేపింది. 

దీనిమీద కేసు నమోదు చేసుకుని విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. వధువు మరో యువకుడిని ప్రేమించిందట. అర్థరాత్రి అతనితో వెళ్లిపోయిందని తెలిసింది. 

ఇలా అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో బుధవారం ఉదయం పెళ్లినుంచి వెళ్లిపోయిన వధువు, ఆమె మరో ప్రియుడు బుధవారం ఉదయం గిండీ పోలీస్ స్టేషన్ ను 
సమాచారం అందుకున్న వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వచ్చి, వారితో చర్చలు జరుపుతున్నారు. 

click me!