ఒక లోక్‌సభ స్థానం... మూడు దశల్లో ఎన్నికలు

By Siva KodatiFirst Published Mar 11, 2019, 9:57 AM IST
Highlights

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పలు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం ప్రత్యేకంగా నిలవబోతోంది. 

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పలు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం ప్రత్యేకంగా నిలవబోతోంది.

దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ఒక్క స్థానానికి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. అనంతనాగ్ జిల్లా భారత్-పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. కశ్మీర్‌ లోయలోని ఈ ప్రాంతం ఉగ్రవాదులకు అడ్డా.

శాంతిభద్రతలతో పాటు ఇక్కడ ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే. భద్రతా సిబ్బందికి పొంచి వున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ స్థానంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

మొత్తం 6 లోక్‌సభ స్థానాలున్న కశ్మీర్‌లో 5 దశల్లో పొలింగ్ జరగనుంది. మరోవైపు ఝార్ఖండ్, ఒడిశాల్లో ఈ సారి 4 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో గరిష్టంగా 2 దశల్లోనే పోలింగ్ ముగిసేది. 

click me!