కరోనాతో సింహం మృతి: జూ సిబ్బందికి టెస్టుల్లో నెగిటివ్, మరి సింహాలకి ఎలా సోకింది..?

Siva Kodati |  
Published : Jun 04, 2021, 07:35 PM IST
కరోనాతో సింహం మృతి: జూ సిబ్బందికి టెస్టుల్లో నెగిటివ్,  మరి సింహాలకి ఎలా సోకింది..?

సారాంశం

కరోనా వైరస్ మనుషులపైనే కాదు జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని ఓ జూలో కరోనాతో ఒక సింహాం మృతిచెందడం కలకలం రేపుతోంది. 

కరోనా వైరస్ మనుషులపైనే కాదు జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని ఓ జూలో కరోనాతో ఒక సింహాం మృతిచెందడం కలకలం రేపుతోంది. అరిగనార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. నీలా అనే 9 సంవత్సరాల ఆడ సింహం కరోనాకు బలైంది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. లాక్‌డౌన్ కారణంగా నెల రోజులుగా ఈ జూ మూసివుంది. జూ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. వారిలో ఎవ్వరికీ కరోనా సోకలేదు. మరి సింహాలకు కోవిడ్ ఎలా సోకిందనే విషయం అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

Also Read:నిన్నటితో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు, మరణాలు
 

PREV
click me!

Recommended Stories

CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
ఎవరీ ప్రహ్లాద్ జోషి.? మోదీ ఈయననే కొత్త విద్యా శాఖ మంత్రిగా ఎందుకు సెలక్ట్ చేశారు.?