జార్ఖండ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్థులు ఎంతో కాలంగా కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్థులు ఎంతో కాలంగా కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది నుండి ఈ కిస్ ఫెస్టివల్ను రద్దు చేస్తున్నట్టు అధికార బీజేపీ ప్రకటించింది.
ముద్దు ద్వారా తమ ప్రేమను వ్యక్త పర్చడం తమ ఆచారమని జార్ఖండ్లోని గిరిజనులు విశ్వసిస్తారు. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో
పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్తులు కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ లో జేఎంఎం కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ముద్దు ఫెస్టివల్కు బీజేపీ అనుమతులను నిరాకరించింది. పబ్లిక్గా ముద్దులు పెట్టుకోవడం భారతీయ గిరిజన సంస్కృతి కాదని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఈ రకమైన ముద్దుల ఫెస్టివల్ సమాజానికి తప్పుడు సంకేతాలను ఇస్తోందని బీజేపీ ప్రకటించింది.
ఈ ఏడాది కిస్ ఫెస్టివల్ నిర్వహించేది లేదని స్థానిక జిల్లా ఎస్డీఓ జితేంద్రకుమార్ ఆదేశాలు జారీ చేశారు.గత ఏడాది 18 జంటలు పబ్లిక్గా ముద్దుపోటీలో పాల్గొన్న వీడియోలు వైరల్గా మారిన విషయం తెలిసిందే.