శబరిమల వివాదం..51 కాదు 17మంది మాత్రమే

Published : Jan 25, 2019, 03:54 PM IST
శబరిమల వివాదం..51 కాదు 17మంది మాత్రమే

సారాంశం

శబరిమల అయ్యప్ప స్వామిని 51మంది 50ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్నారంటూ కేరళ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదన తప్పు అని తేలింది.

శబరిమల అయ్యప్ప స్వామిని 51మంది 50ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్నారంటూ కేరళ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదన తప్పు అని తేలింది. కేవలం 17మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నారని తాజాగా తెలిసింది.

ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మహిళలు తొలిసారిగా 50ఏళ్లలోపు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.. దీంతో.. తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఇద్దరి తర్వాత మరికొంత మంది కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 51మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని చెప్పారు.

ఆ 51మంది జాబితాను పరిశీలించగా.. అందులో కొన్ని పురుషుల పేర్లు.. కొందరు 51ఏళ్లకు పైబడిన వారుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకున్న 50ఏళ్లలోపు మహిళల సంఖ్య 17గా తేలిందని అధికారులు తెలిపారు.  51మందిలో నలుగురు పురుషులు, 30 మంది 50ఏళ్లు పైబడిన మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?