మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీచర్

Published : Jun 02, 2019, 05:14 PM IST
మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీచర్

సారాంశం

విద్యాబుద్దులు నేర్పించి పిల్లలకు మార్గదర్శకంగా నిలవాల్సిన  మదర్సా టీచర్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది.  


తిరువనంతపురం: విద్యాబుద్దులు నేర్పించి పిల్లలకు మార్గదర్శకంగా నిలవాల్సిన  మదర్సా టీచర్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ పన్నెండు మందికి పైగా  విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.  ఈ నిందితుడిని పోలీసులు  అరస్ట్ చేశారు. కేరళలోని కొట్టాయం జిల్లా కొడునగలూరులో స్థానిక మొహల్లా కమిటీ ఫిర్యాదుపై మదర్సా టీచర్ యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

పాతికేళ్ల వయస్సు నుండే బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవాడినని యూసుఫ్ అంగీకరించాడని పోలీసులు  తెలిపారు.  తాను చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు  గురైనట్టుగా చెప్పారు. తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించారు.
 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు