సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం.. సెలవు ప్రకటించిన కర్ణాటక సర్కారు 

By Rajesh KarampooriFirst Published Jan 3, 2023, 2:15 AM IST
Highlights

కర్ణాటకలోని జ్ఞానయోగాశ్రమంలోని ప్రముఖ సన్యాసి సిద్ధేశ్వర స్వామీజీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కర్ణాటక సర్కారు స్పష్టంచేసింది. 

కర్ణాటకలోని విజయపూర్ కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి ప్రముఖ సన్యాసి సిద్ధేశ్వర స్వామిజీ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో ఆయన  సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. అతను కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఆశ్రమంలో స్వామీజీ తుదిశ్వాస విడిచినట్లు విజయపూర్ డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేశ్ దానమాన్వా తెలిపారు.

అదే సమయంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు జ్ఞానయోగాశ్రమానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. మహారాష్ట్ర , ఆంధప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున్న భక్తులు వస్తున్నారు. స్వామీజీకి అశ్రు నివాళులర్పిస్తున్నారు. ఇక సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం  తెలిపింది. అదే సమయంలో.. విజయపూర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 3) ఆయన గౌరవార్థం పాఠశాలలు-కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

అంత్యక్రియలు

మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు సిద్ధేశ్వర స్వామీజీ పార్థివదేహాన్ని ఆశ్రమంలో సాధారణ ప్రజల చివరి దర్శనం కోసం ఉంచుతారని, ఆ తర్వాత సైనిక్ స్కూల్ ప్రాంగణంలో భౌతికకాయాన్ని ఉంచుతారని అధికారిక ప్రకటన తెలిపింది. భౌతికకాయాన్ని మరోసారి ఆశ్రమానికి తీసుకొచ్చి, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆశ్రమం ప్రకారం..  సాధువు యొక్క చివరి కర్మలు వారి  కోరిక మేరకు నిర్వహించబడతాయి. సోమవారం మూడో రోజు కూడా ఆహారం తీసుకోవడానికి సాధువు నిరాకరించినట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం నుండి సాధువు ఆరోగ్యం క్షీణించడంతో ఆశ్రమం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ప్రజలు ఆయనను చూసేందుకు వేచి ఉన్నారు.

ప్రధాని మోదీ సంతాపం 

సిద్ధేశ్వర స్వామి మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని తెలిపారు. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేశారని సిద్ధేశ్వర స్వామి సేవలను కొనియాడారు. ఈ దుఃఖ ఘడియలో నా ఆలోచనలు ఆయన అనేక మంది భక్తులతో ఉన్నాయి. ఓం శాంతి! పేర్కొన్నారు. 

Paramapujya Sri Siddheshwara Swami Ji will be remembered for his outstanding service to society. He worked tirelessly for the betterment of others and was also respected for his scholarly zeal. In this hour of grief, my thoughts are with his countless devotees. Om Shanti. pic.twitter.com/DbWtdvROl1

— Narendra Modi (@narendramodi)


సిద్ధేశ్వర స్వామీజీ మృతి రాష్ట్రానికి తీరని లోటని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. విజయపూర్‌లోని జ్ఞానయోగాశ్రమానికి చెందిన సిద్ధేశ్వర స్వామీజీ మృతి చెందారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన అన్నారు. తన ప్రసంగాల ద్వారా మానవాళి మోక్షానికి అద్భుతమైన, అద్వితీయమైన సేవ చేసారు. ఆయన భక్తులకు ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అని సంతాపం ప్రకటించారు. 

click me!