విదేశీ బాలికపై స్విమ్మింగ్ పూల్ లో, రిసార్ట్ గదిలో అత్యాచారం.. గోవాలో దారుణం...

By SumaBala BukkaFirst Published May 13, 2022, 8:19 AM IST
Highlights

మన దేశానికి విహారయాత్రకు వచ్చిన ఓ విదేశీ కుటుంబానికి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరి 12యేళ్ల కూతురు మీద రూమ్ అంటెండర్ లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పనాజీ : గోవాలోని ఓ రిసార్టులో విదేశీ బాలికపై molestation జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై ఉత్తర goaలోని అరంబోల్ లోని ఓ రిసార్ట్ లో రూమ్ అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా.. అతనిని arrest చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్ పూల్ లో, ఆ తర్వాత హోటల్ గదిలో ఈ నెల 6న అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 9న ఫిర్యాదు చేసింది. 

దగ్గర్లో ఉన్న మార్కెట్ లో కొన్ని వస్తువులు కొనుక్కునేందుకు బయటికి వెళ్లినప్పుడు తన కూతురిని స్విమ్మింగ్ పూల్ లో వదిలేసి వెళ్లినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడని పెర్నెమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ నాయక్ తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే అతడు కర్ణాటకలోని గదగ్ కు చెందిన ravi lamani గా గుర్తించి ఈ నెల 10న అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుడికి వివాహం కూడా అయిందన్నారు. ఈ కేసులో నిందితుడిమీద పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

కాగా, తెలంగాణలోని చౌటుప్పల్ లో tribal married woman (28)పై molestationకి పాల్పడి, ఆమెను murder చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు తలపై కర్రతో బాది అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెబుతానని అన్నందుకు ఆమెను హతమార్చాడు. ప్రాణాలు కోల్పోయాక కూడా మరోసారి అత్యాచారం చేశాడు. భువనగిరి జిల్లా తూప్రాన్ పేటలో జరిగిన ఈ హత్యాచారం వివరాలను చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం వెంకటాపురంకి చెందిన ఈడిగి హరీష్ రావు (25)  తూప్రాన్ పేటలో కూలీగా పని చేస్తున్నాడు. 

మూడ వారాల కిందట వల్లభ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక బోరు తవ్వారు. ఆ పనికి వెళ్లి నిందితుడు… సమీపంలోని గోదాములో వివాహిత పగలు ఒంటరిగా ఉంటుందని గమనించాడు. సోమవారం సాయంత్రం ఆమె భర్త లేని సమయంలో హరీష్ గౌడ్ గోదాములోకి ప్రవేశించి లైంగికదాడికి పాల్పడ్డాడు. రాత్రి ఆమె భర్త ఇంటికి వచ్చాక దారుణం వెలుగుచూసింది. నిందితుడిని మంగళవారం Vallabha డైరీ లేబర్ షెడ్ లో అదుపులోకి తీసుకున్నట్లు ఏసిపి చెప్పారు. అయితే గతంలో అతని మీద కోహిర్ పోలీస్స్టేషన్లో ఓ చోరీ కేసు కూడా నమోదు అయింది అన్నారు.

హత్యాచారానికి సంబంధించి.. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలి నుండి అతడు దొంగిలించిన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడిని వేగంగా పట్టుకున్న పోలీసులు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించి రివార్డులు పంపించారు అని చెప్పారు. నిందితుడుని  చౌటుప్పల్ కోర్టులో హాజరు పరచి నల్గొండ జైలు కు తరలించినట్లు తెలిపారు. 

click me!