కేరళ తీరంలో ఉగ్రకదలికలు.. నిఘా హెచ్చరికలతో కర్ణాటక అప్రమత్తం, హై అలర్ట్

Siva Kodati |  
Published : Sep 01, 2021, 03:56 PM IST
కేరళ తీరంలో ఉగ్రకదలికలు.. నిఘా హెచ్చరికలతో కర్ణాటక అప్రమత్తం, హై అలర్ట్

సారాంశం

కేర‌ళ తీర ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాలు జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కర్ణాటక  ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వ‌ర్గాల హెచ్చరికలతో క‌ర్నాట‌క తీర ప్రాంతాల్లో హై అల‌ర్ట్ జారీ చేశామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై బుధ‌వారం ప్రకటించారు. 

కేర‌ళ తీర ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాలు జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కర్ణాటక  ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వ‌ర్గాల హెచ్చరికలతో క‌ర్నాట‌క తీర ప్రాంతాల్లో హై అల‌ర్ట్ జారీ చేశామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై బుధ‌వారం ప్రకటించారు. హుబ్లి విమానాశ్ర‌యంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ నిఘా వ‌ర్గాల స‌మాచారంతో క‌ర్నాట‌క‌లోని కోస్తా ప్రాంతంతో పాటు స‌మీప అట‌వీ ప్రాంతాల్లో అనుమానాస్ప‌ద కార్య‌క‌లాపాల‌పై రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టి సారించింద‌ని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు ఏమైనా జ‌రుగుతున్నాయా అనే కోణంలో ఎన్ఐఏతో క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం నిఘా పెంచింద‌ని ఈ విష‌యాల‌న్నింటినీ తాను బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేన‌ని తెలిపారు. ఉగ్ర కార్య‌క‌లాపాలు జరుపుతున్న ఓ వ్య‌క్తిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింద‌ని బొమ్మై చెప్పారు. తీర ప్రాంతాల్లో ప్ర‌భుత్వం హై అల‌ర్ట్ జారీ చేసింద‌ని సీఎం వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu