కర్ణాటకలో పనిచేసే బ్యాంక్ ఉద్యోగులు కన్నడ నేర్చుకోవాల్సిందే.. సిద్ధూ సర్కార్ సంచలన నిర్ణయం

Siva Kodati |  
Published : Sep 08, 2023, 02:29 PM IST
కర్ణాటకలో పనిచేసే బ్యాంక్ ఉద్యోగులు కన్నడ నేర్చుకోవాల్సిందే.. సిద్ధూ సర్కార్ సంచలన నిర్ణయం

సారాంశం

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో బ్యాంకు ఉద్యోగులు కన్నడ నేర్చుకోవడాన్ని , స్థానికులతో ఆ భాషలో సంభాషించడాన్ని తప్పనిసరి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వస్తుందని తాము ఆశిస్తున్నామని కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ (కెడిఎ) కార్యదర్శి సంతోష్ హంగల్ అన్నారు. 

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో బ్యాంకు ఉద్యోగులు కన్నడ నేర్చుకోవడాన్ని , స్థానికులతో ఆ భాషలో సంభాషించడాన్ని తప్పనిసరి చేయనుంది. కన్నడ భాషను తప్పనిసరి చేయాలన్న దీర్ఘకాల డిమాండ్‌ను పరిష్కరించే ప్రయత్నంగా ఈ చర్య పరిగణించబడుతుంది. కన్నడలో కాకుండా ఇతర భాషలలో బ్యాంకు ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయడం రాష్ట్రంలోని చాలా మంది ప్రజలకు కష్టంగా వుంది. 

కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ (కెడిఎ) కార్యదర్శి సంతోష్ హంగల్ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని సూచించారు. గత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో కన్నడ భాషా సమగ్ర అభివృద్ధి బిల్లు, 2022ని ఆమోదించింది. ఇది ప్రభుత్వ కార్యాలయాలలో కన్నడను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. అయినా బిల్లు అమలుకు నోచుకోలేదు. ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వస్తుందని తాము ఆశిస్తున్నామని సంతోష్ పేర్కొన్నారు. 

కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన కన్నడ భాషా సమగ్ర అభివృద్ధి బిల్లు, 2022 ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వంలో ఉద్యోగం లేదా ఏదైనా స్థానిక అధికారులు, బోర్డులు, కార్పొరేషన్లు, చట్టబద్ధమైన లేదా చట్టబద్ధత లేని సంస్థలు లేదా రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్ సొసైటీలు , ఇతర ఉద్యోగాలను కోరుకునే వ్యక్తికి కన్నడను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని సంఘాలు తప్పనిసరిగా "కన్నడ భాషా పరీక్ష"లో ఉత్తీర్ణత సాధించాలి.

100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న బ్యాంకులు రోజువారీ పని విధుల్లో భాషను ఉపయోగించేందుకు భాషపై పరిజ్ఞానం ఉన్న సీనియర్ ఉద్యోగుల నేతృత్వంలో 'కన్నడ సెల్'ను ఏర్పాటు చేయాలని బిల్లు తప్పనిసరి చేసింది. ఆగస్టు 2017లో ప్రభుత్వ,  గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న కన్నడిగేతర ఉద్యోగులను ఆరు నెలల్లో కన్నడ నేర్చుకోవాలని లేదా వారు ఉద్యోగాలను వదిలివేయాలని కేడీఏ ఆదేశించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu