కర్ణాటక బలపరీక్ష...సభలోనే నిద్రించిన బీజేపీ నేతలు

Published : Jul 19, 2019, 09:29 AM IST
కర్ణాటక బలపరీక్ష...సభలోనే నిద్రించిన బీజేపీ నేతలు

సారాంశం

విశ్వాసపరీక్ష జరగకుండానే వాయిదాపడిన కర్ణాటక అసెంబ్లీ ఆందోళన చేపట్టిన బీజేపీ నేతలు రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రించిన బీజేపీ నేతలు

కర్ణాటక రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. గురువారం జరగాల్సిన బలపరీక్ష నేటికి వాయిదా పడింది. విశ్వాసపరీక్ష లేకుండానే సభ నేటికి వాయిదా పడటంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నేతలందరూ గురువారం రాత్రి అసెంబ్లీలోనే నిద్రించడం గమనార్హం. అంతేకాదు.. ఉదయాన్నే నిద్రలేచి అక్కడే మార్నింగ్ వాక్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలందరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరికాసేపట్లో సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విప్ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అయ్యింది. ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ధారామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. మరి ఈ రోజైనా విశ్వాసపరీక్ష సజావుగా సాగుతుందో  లేదో  చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Santal Conference : బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం? మోదీ వర్సెస్ మమత.. అసలేం జరిగింది?
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌