కర్ణాటక సంక్షోభం: సస్పెన్స్ కంటిన్యూ.. బలపరీక్ష రేపటికి వాయిదా

By Siva KodatiFirst Published Jul 18, 2019, 6:36 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సురేశ్ కుమార్ తెలిపారు. దీంతో బీజేపీ నేత యడ్యూరప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళే బలపరీక్షను నిర్వహించాలంటూ ఆయన నిరసన తెలుపుతున్నారు. 

అనూహ్య మలుపు తిరుగుతున్న కర్ణాటక సంక్షోభంలో ఉత్కంఠను కొనసాగిస్తూ.. అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విశ్వాస పరీక్షను సైతం రేపటికి వాయిదా వేస్తున్నట్లు సురేశ్ కుమార్ తెలిపారు.

అయితే బలపరీక్షను ఇవాళే నిర్వహించాలన్న గవర్నర్ సూచనను స్పీకర్ పట్టించుకోలేదంటూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిరసన వ్యక్తం చేశారు. బలపరీక్ష ఇప్పుడే నిర్వహించాలని.. లేదంటే రాత్రంతా విధానసభలో ఉండి నిరసన తెలుపుతానని యడ్డీ హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు సైతం రాత్రికి సభలోనే నిద్రపోతారని ఆయన తెలిపారు.  

click me!
Last Updated Jul 18, 2019, 6:36 PM IST
click me!