మోగ‌నున్న క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా.. నేడు షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న ఈసీ

Published : Mar 29, 2023, 09:20 AM IST
మోగ‌నున్న క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా.. నేడు షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న ఈసీ

సారాంశం

Bengaluru: నేడు కర్ణాటక అసెంబ్లీకి నిర్వ‌హించే ఎన్నికల తేదీని భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీ) ప్ర‌క‌టించ‌నుంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 75 మంది, దాని మిత్రపక్షం జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  

Karnataka Assembly elections 2023: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల సంఘం తేదీని ప్రకటిస్తుంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ గడువు మే 24తో ముగియనుంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గాను కనీసం 150 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. కాంగ్రెస్ సైతం దూకుడుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 124 మంది, జేడీఎస్ 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించాయి.

రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల అంశం అయిన బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం గతవారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం రెండు కొత్త కేటగిరీలను ప్రకటించింది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ముస్లింలకు కేటాయించిన 4 శాతం కోటాను కూడా ముఖ్యమంత్రి బొమ్మై రద్దు చేశారు. 4 శాతం రిజర్వేషన్లను వొక్కలిగ, లింగాయత్ వర్గాలకు సమానంగా పంచనున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 75 మంది, దాని మిత్రపక్షం జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నియోజకవర్గాల్లో టికెట్లు ఇప్పిస్తున్నారని ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఆరోపించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గత రెండు మూడు రోజులుగా 100 నియోజకవర్గాల్లోని తమ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారనీ, అక్కడ వారు ఇంకా టికెట్లు ప్రకటించలేదని చెప్పారు. "మీరు (బీజేపీ ఎమ్మెల్యేలు) కాంగ్రెస్ లోకి వస్తే మీకు టికెట్ ఇస్తామని ఆయన చెబుతున్నారు" అని బొమ్మై ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పోరాడుతున్న సమయంలో బీజేపీపై అనేక అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. 

క‌ర్నాట‌క‌లో మరో ప్రధాన శక్తి అయిన జనతాదళ్-సెక్యులర్ కూడా 93 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్లపై 50 శాతం సబ్సిడీ ఇస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. "ఉచిత గ్యాస్ ఇస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకాన్ని అమలు చేసింది. ఇది నమ్మిన మహిళలకు సిలిండర్ ఇచ్చి ధరల పెంపుతో షాక్ ఇచ్చారు. ఇప్పుడు సిలిండర్ ధర రూ.1,000 దాటిందని, పేదలు బతకడం అసాధ్యమని" కుమారస్వామి విమర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu