70ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా గురు గ్రహం...!

Published : Sep 19, 2022, 12:28 PM IST
 70ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా గురు గ్రహం...!

సారాంశం

భూమికన్నా గురు గ్రహానికి  అయస్కాంత క్షేత్రం 14 రెట్లు బలంగా ఉంటుంది. పరిమాణంలోనూ ఈ గ్రహం భూమికన్నా 318 రెట్లు పెద్దదిగా ఉండటం గమనార్హం. కాగా... ఈ గ్రహం దాదాపు 70ఏళ్ల తర్వాత  భూమికి దగ్గరగా వస్తుండటం విశేషం.

అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం దాదాపు 70ఏళ్ల తర్వాత భూమికి దగ్గరకు రానుంది. సౌర వ్యవస్థలోనే అతి పెద్ద గ్రహం గురుడు. భూమికన్నా గురు గ్రహానికి  అయస్కాంత క్షేత్రం 14 రెట్లు బలంగా ఉంటుంది. పరిమాణంలోనూ ఈ గ్రహం భూమికన్నా 318 రెట్లు పెద్దదిగా ఉండటం గమనార్హం. కాగా... ఈ గ్రహం దాదాపు 70ఏళ్ల తర్వాత  భూమికి దగ్గరగా వస్తుండటం విశేషం.


సెప్టెంబర్ 26 రాత్రిన భూమికి గురు గ్రహం పూర్తిగా దగ్గరకు వచ్చే అవకాశం ఉందట.  గురు గ్రహం వ్యతిరేకతను చేరుకున్నప్పుడు ఆకాశంలో కనిపిస్తుందట. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నప్పుడు ఖగోళ వస్తువు తూర్పున ఉదయించినప్పుడు..  గ్రహం సూర్యుడిని భూమికి ఎదురుగా ఉంచినప్పుడు గ్రహం వ్యతిరేకత జరుగుతుంది. 

ఇది కామన్ గా జరిగేదే. కానీ... ఈసారి మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది 70 సంవత్సరాలలో భూమికి బృహస్పతి  అత్యంత దగ్గరగా ఉంటుంది. సూర్యుని చుట్టూ ఉన్న రెండు గ్రహాల కక్ష్యలో వ్యత్యాసం కారణంగా ఇది జరుగుతుంది. బృహస్పతి, భూమి రెండూ సంపూర్ణ వృత్తాలలో సూర్యుని చుట్టూ తిరగవు. అంటే గ్రహాలు ఏడాది పొడవునా వేర్వేరు దూరాలలో ఒకదానికొకటి వెళతాయి. ప్రస్తుతం గురు గ్రహం.. మన నుండి 58 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని నాసా అధికారులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

PM Modi : తెలంగాణకు మోదీ వరాలు.. గోల్డ్ కొనొద్దని ప్రధాని ఎందుకు అన్నారు?
CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu