అతివేగంతో ఆటోను ఢీకొట్టిన‌ బైకు.. ముగ్గురు స్పాట్ డెడ్

By Mahesh RajamoniFirst Published Dec 20, 2022, 12:03 AM IST
Highlights

Khunti: అతివేగంతో వ‌చ్చిన ఒక బైకు ఎదురుగా వ‌స్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 

Jharkhand Road Accident: అతివేగంతో వ‌చ్చిన ఒక బైకు ఎదురుగా వ‌స్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోడ్డు ప్ర‌మాదం జార్ఖండ్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. 7-8 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను మోటర్‌బైక్ ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుందని ఇండియా టూడే నివేదించింది. ఈ ప్రమాదంలో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఖుంటి సరిహద్దు ప్రాంతంలోని అనెగడ ఇండియన్ ఆయిల్ డిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ కేసు ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

వేగంగా వస్తున్న బైక్‌ త్రిచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి కుంటి పోలీస్ స్టేషన్ అధికారులు చేరుకున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

click me!